Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:01 AM

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో శీతాకాల సమావేశ శిబిరాల్లో శ్రమదానం

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో శీతాకాల సమావేశ శిబిరాల్లో శ్రమదానం

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో శీతాకాల సమావేశ శిబిరాల్లో శ్రమదానం
22-01-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

స్థానికం ప్రధాన ప్రతినిధి

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో నిర్వహిస్తున్న శీతాకాల సమావేశ శిబిరాల సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విస్తృతంగా శ్రమదానం చేశారు. దోరేపల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు పాఠశాల పరిసరాలు, గ్రామంలోని ప్రధాన రోడ్లపై పెరిగిన కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అలాగే మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బక్క ఎల్లమ్మ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణమే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు.అదేవిధంగా పగిడిమర్రి గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–సిక్స్ ఆధ్వర్యంలో వాలంటీర్లు గ్రామ రోడ్ల వెంట పెరిగిన కంప చెట్లను తొలగించి రహదారులను శుభ్రంగా ఉంచేందుకు శ్రమదానం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సింగ్ కోటయ్య, ఎన్ఎస్ఎస్ యూనిట్–సిక్స్ ప్రోగ్రాం ఆఫీసర్ కంబాలపల్లి శివరాణి, అధ్యాపకులు కె. నాగరాజు, పంచాయతీ కార్యదర్శి గణేష్, పగిడిమర్రి గ్రామ సర్పంచ్ నాగవల్లి నాగమణి, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు, బక్క రాజశేఖర్, గ్రామ ప్రజలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Sthanikam

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో శీతాకాల సమావేశ శిబిరాల్లో శ్రమదానం

Article Image

పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

స్థానికం ప్రధాన ప్రతినిధి

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో నిర్వహిస్తున్న శీతాకాల సమావేశ శిబిరాల సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విస్తృతంగా శ్రమదానం చేశారు. దోరేపల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు పాఠశాల పరిసరాలు, గ్రామంలోని ప్రధాన రోడ్లపై పెరిగిన కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అలాగే మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బక్క ఎల్లమ్మ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణమే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు.అదేవిధంగా పగిడిమర్రి గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–సిక్స్ ఆధ్వర్యంలో వాలంటీర్లు గ్రామ రోడ్ల వెంట పెరిగిన కంప చెట్లను తొలగించి రహదారులను శుభ్రంగా ఉంచేందుకు శ్రమదానం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సింగ్ కోటయ్య, ఎన్ఎస్ఎస్ యూనిట్–సిక్స్ ప్రోగ్రాం ఆఫీసర్ కంబాలపల్లి శివరాణి, అధ్యాపకులు కె. నాగరాజు, పంచాయతీ కార్యదర్శి గణేష్, పగిడిమర్రి గ్రామ సర్పంచ్ నాగవల్లి నాగమణి, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు, బక్క రాజశేఖర్, గ్రామ ప్రజలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News