Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:40 AM

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో శీతాకాల సమావేశ శిబిరాల్లో శ్రమదానం

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో శీతాకాల సమావేశ శిబిరాల్లో శ్రమదానం

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో శీతాకాల సమావేశ శిబిరాల్లో శ్రమదానం
January 22, 2026 06:17 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు

స్థానికం ప్రధాన ప్రతినిధి

దోరేపల్లి, పగిడిమర్రి గ్రామాల్లో నిర్వహిస్తున్న శీతాకాల సమావేశ శిబిరాల సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విస్తృతంగా శ్రమదానం చేశారు. దోరేపల్లి గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు పాఠశాల పరిసరాలు, గ్రామంలోని ప్రధాన రోడ్లపై పెరిగిన కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. అలాగే మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బక్క ఎల్లమ్మ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణమే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు.అదేవిధంగా పగిడిమర్రి గ్రామంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–సిక్స్ ఆధ్వర్యంలో వాలంటీర్లు గ్రామ రోడ్ల వెంట పెరిగిన కంప చెట్లను తొలగించి రహదారులను శుభ్రంగా ఉంచేందుకు శ్రమదానం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ యూనిట్–వన్ ప్రోగ్రాం ఆఫీసర్ నర్సింగ్ కోటయ్య, ఎన్ఎస్ఎస్ యూనిట్–సిక్స్ ప్రోగ్రాం ఆఫీసర్ కంబాలపల్లి శివరాణి, అధ్యాపకులు కె. నాగరాజు, పంచాయతీ కార్యదర్శి గణేష్, పగిడిమర్రి గ్రామ సర్పంచ్ నాగవల్లి నాగమణి, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రావు, బక్క రాజశేఖర్, గ్రామ ప్రజలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News