PRINT TIME: February 24, 2026 04:20 AM
దంతురి అంజమ్మ మృతితో న్యాయవర్గాల్లో విషాదఛాయలు
దంతురి అంజమ్మ మృతితో న్యాయవర్గాల్లో విషాదఛాయలు
January 25, 2026 05:36 PM
101 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట న్యాయస్థానంలో విధులు నిర్వహిస్తున్న రెండవ తరగతి మజిస్ట్రేట్ దంతురి సత్తయ్య తల్లి దంతురి అంజమ్మ పరమపదించడం న్యాయవర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ విషాద వార్త వెలువడగానే రామన్నపేట న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ సభ్యులు, ప్రభుత్వ సహాయ న్యాయవాది కలిసి మృతాత్మకు గాఢ నివాళులు అర్పించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ దుఃఖ సమయంలో మజిస్ట్రేట్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ అపార నష్టం కుటుంబానికి తీరని లోటు అని పేర్కొంటూ, రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆదిక్షులు మజీద్, ప్రభుత్వ సహాయ న్యాయవాది సుక్క శ్రవణ్ కుమార్తో పాటు సీనియర్ న్యాయవాదులు కృష్ణారెడ్డి, కంపాటి యాదగిరి, జినుకల ప్రభాకర్, హనుమంత్ గౌడ్, రామదాసు, డేవిడ్, జగతయ్య, బాలరాజు, స్వామి, శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి