Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:36 AM

డంపింగ్ యార్డు తరలింపు ఖాయం – పేదలకు ఇళ్ల హామీ చిట్యాల 1వ వార్డులో ఎమ్మెల్యే వేముల వీరేశం

డంపింగ్ యార్డు తరలింపు ఖాయం – పేదలకు ఇళ్ల హామీ చిట్యాల 1వ వార్డులో ఎమ్మెల్యే వేముల వీరేశం

డంపింగ్ యార్డు తరలింపు ఖాయం – పేదలకు ఇళ్ల హామీ చిట్యాల 1వ వార్డులో ఎమ్మెల్యే వేముల వీరేశం
January 13, 2026 12:03 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 01వ వార్డు శివనేనిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించి స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ఆయన, జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డును తరలించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇళ్ల కేటాయింపులు జరగలేదని విమర్శించారు. శివనేనిగూడెంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, వచ్చే మార్చిలో ఈ వార్డుకు 60 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డు గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించిన ఆయన, దీనిని తప్పకుండా మార్చుతామని స్పష్టం చేశారు.

అదేవిధంగా చెరువు పూడికతీత పనులు చేపడతామని, చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 240 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను త్వరలోనే పేదలకు కేటాయిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News