Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

డంపింగ్ యార్డు తరలింపు ఖాయం – పేదలకు ఇళ్ల హామీ చిట్యాల 1వ వార్డులో ఎమ్మెల్యే వేముల వీరేశం

డంపింగ్ యార్డు తరలింపు ఖాయం – పేదలకు ఇళ్ల హామీ చిట్యాల 1వ వార్డులో ఎమ్మెల్యే వేముల వీరేశం

డంపింగ్ యార్డు తరలింపు ఖాయం – పేదలకు ఇళ్ల హామీ చిట్యాల 1వ వార్డులో ఎమ్మెల్యే వేముల వీరేశం
13-01-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 01వ వార్డు శివనేనిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించి స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ఆయన, జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డును తరలించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇళ్ల కేటాయింపులు జరగలేదని విమర్శించారు. శివనేనిగూడెంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, వచ్చే మార్చిలో ఈ వార్డుకు 60 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డు గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించిన ఆయన, దీనిని తప్పకుండా మార్చుతామని స్పష్టం చేశారు.

అదేవిధంగా చెరువు పూడికతీత పనులు చేపడతామని, చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 240 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను త్వరలోనే పేదలకు కేటాయిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు.

Sthanikam

డంపింగ్ యార్డు తరలింపు ఖాయం – పేదలకు ఇళ్ల హామీ చిట్యాల 1వ వార్డులో ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 01వ వార్డు శివనేనిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించి స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ఆయన, జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డును తరలించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇళ్ల కేటాయింపులు జరగలేదని విమర్శించారు. శివనేనిగూడెంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, వచ్చే మార్చిలో ఈ వార్డుకు 60 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డు గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించిన ఆయన, దీనిని తప్పకుండా మార్చుతామని స్పష్టం చేశారు.

అదేవిధంగా చెరువు పూడికతీత పనులు చేపడతామని, చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 240 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను త్వరలోనే పేదలకు కేటాయిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News