Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:45 PM

డంపింగ్ యార్డు తరలింపు ఖాయం – పేదలకు ఇళ్ల హామీ చిట్యాల 1వ వార్డులో ఎమ్మెల్యే వేముల వీరేశం

డంపింగ్ యార్డు తరలింపు ఖాయం – పేదలకు ఇళ్ల హామీ చిట్యాల 1వ వార్డులో ఎమ్మెల్యే వేముల వీరేశం

డంపింగ్ యార్డు తరలింపు ఖాయం – పేదలకు ఇళ్ల హామీ చిట్యాల 1వ వార్డులో ఎమ్మెల్యే వేముల వీరేశం
January 13, 2026 12:03 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 01వ వార్డు శివనేనిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించి స్థానికుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. డంపింగ్ యార్డు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించిన ఆయన, జనావాసాలకు దూరంగా డంపింగ్ యార్డును తరలించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు ఇళ్ల కేటాయింపులు జరగలేదని విమర్శించారు. శివనేనిగూడెంలో ఇళ్లు లేని పేద కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, వచ్చే మార్చిలో ఈ వార్డుకు 60 ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డు గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించిన ఆయన, దీనిని తప్పకుండా మార్చుతామని స్పష్టం చేశారు.

అదేవిధంగా చెరువు పూడికతీత పనులు చేపడతామని, చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందిస్తామని తెలిపారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 240 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను త్వరలోనే పేదలకు కేటాయిస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News