PRINT TIME: February 24, 2026 04:38 AM
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకానికి ప్రభుత్వ పిలుపు
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకానికి ప్రభుత్వ పిలుపు
January 21, 2026 06:41 PM
85 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి,స్థానికం ప్రధాన ప్రతినిధి
దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివాహ ప్రోత్సాహక పథకాన్ని వినియోగించుకోవాలని మహిళ, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పిలుపునిచ్చింది.దివ్యాంగుడు సాధారణ వ్యక్తిని వివాహం చేసుకుంటే రూ.1 లక్ష ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని, దివ్యాంగుడు మరో దివ్యాంగుడిని వివాహం చేసుకుంటే రూ.2 లక్షల ప్రోత్సాహకాన్ని మంజూరు చేస్తుందని జిల్లా సంక్షేమ అధికారి కె. నరసింహ రావు ఒక ప్రకటనలో తెలిపారు.అర్హులైన దివ్యాంగులు వివాహమైన తేదీ నుంచి ఏడాది లోపల TS EPASS వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఆమోదంతో ఈ ప్రోత్సాహక మొత్తాన్ని విడుదల చేస్తామని వెల్లడించారు.ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అర్హులైన దివ్యాంగులకు జిల్లా సంక్షేమ శాఖ సూచించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి