Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:52 AM

దివ్యాంగుల జీవితాల్లో సంబరాల వెలుగు. ఎమ్మెల్యే వేముల వీరేశం

దివ్యాంగుల జీవితాల్లో సంబరాల వెలుగు. ఎమ్మెల్యే వేముల వీరేశం

దివ్యాంగుల జీవితాల్లో సంబరాల వెలుగు. ఎమ్మెల్యే వేముల వీరేశం
27-01-2026 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దివ్యాంగుల స్వావలంబనకు ప్రభుత్వ దృఢ సంకల్పం

నకిరేకల్‌లో సహాయక పంపిణీ

స్థానికం ప్రధాన ప్రతినిధి

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో దివ్యాంగుల. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం హాజరై అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు స్కూటీలు, ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశమని స్పష్టం చేశారు. విద్యలో ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల విస్తరణ ద్వారా దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అవసరమైన ప్రతి దివ్యాంగుడి వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రభుత్వ సహాయం లబ్ధిదారుల చేతుల్లోకి చేరిన ఈ కార్యక్రమం దివ్యాంగుల జీవితాల్లో కొత్త నమ్మకాన్ని నింపింది. సంక్షేమ పాలనకు ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Sthanikam

దివ్యాంగుల జీవితాల్లో సంబరాల వెలుగు. ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

దివ్యాంగుల స్వావలంబనకు ప్రభుత్వ దృఢ సంకల్పం

నకిరేకల్‌లో సహాయక పంపిణీ

స్థానికం ప్రధాన ప్రతినిధి

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో దివ్యాంగుల. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం హాజరై అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు స్కూటీలు, ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశమని స్పష్టం చేశారు. విద్యలో ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల విస్తరణ ద్వారా దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అవసరమైన ప్రతి దివ్యాంగుడి వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రభుత్వ సహాయం లబ్ధిదారుల చేతుల్లోకి చేరిన ఈ కార్యక్రమం దివ్యాంగుల జీవితాల్లో కొత్త నమ్మకాన్ని నింపింది. సంక్షేమ పాలనకు ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News