దివ్యాంగుల జీవితాల్లో సంబరాల వెలుగు. ఎమ్మెల్యే వేముల వీరేశం
దివ్యాంగుల జీవితాల్లో సంబరాల వెలుగు. ఎమ్మెల్యే వేముల వీరేశం
స్థానికం బృందం
దివ్యాంగుల స్వావలంబనకు ప్రభుత్వ దృఢ సంకల్పం
నకిరేకల్లో సహాయక పంపిణీ
స్థానికం ప్రధాన ప్రతినిధి
నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో దివ్యాంగుల. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం హాజరై అర్హులైన దివ్యాంగ లబ్ధిదారులకు స్కూటీలు, ల్యాప్టాప్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశమని స్పష్టం చేశారు. విద్యలో ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల విస్తరణ ద్వారా దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అవసరమైన ప్రతి దివ్యాంగుడి వరకు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రభుత్వ సహాయం లబ్ధిదారుల చేతుల్లోకి చేరిన ఈ కార్యక్రమం దివ్యాంగుల జీవితాల్లో కొత్త నమ్మకాన్ని నింపింది. సంక్షేమ పాలనకు ఇది స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి