Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:00 AM

డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలు ప్రారంభం

డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలు ప్రారంభం

డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడలు ప్రారంభం
January 13, 2026 04:56 PM 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల :

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ గ్రామ కమిటీల ఆధ్వర్యంలో సంక్రాంతి క్రీడా పోటీలను ఘనంగా ప్రారంభించారు.క్రీడల ప్రారంభోత్సవంగా గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి క్రీడల జెండాను, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ డివైఎఫ్ఐ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ముగ్గుల పోటీలను డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ, మాజీ ఎంపిటిసి దేశబోయిన స్వరూప ప్రారంభించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వెలిమినేడు గ్రామంలో ముగ్గుల పోటీలు, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ తదితర క్రీడలను ఆనవాయితీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామీణ క్రీడలు యువతలో ఐక్యత, ఆరోగ్యం, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొంటూ, గ్రామ యువతీ యువకులు ఈ క్రీడలను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జిట్టా నాగేష్, మాజీ ఎంపిటిసీలు ఆరూరి శ్రీను, నెలికంటి నరసింహ, ఎనిమిదో వార్డు సభ్యులు నాతి కిరణ్, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు పంది నరేష్, మండల ఉపాధ్యక్షులు కూనూరు గణేష్, గోలి సాయికిరణ్, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఆరూరి ప్రణీత్తో పాటు ప్రజా సంఘాల నాయకులు దేశబోయిన లింగస్వామి, దేశబోయిన నర్సింహ, నాతి వెంకట్రామయ్య, ఆరూరి దుర్గయ్య, సుర్కంటి మోహన్ రెడ్డి, ఆరూరి శంబయ్య, ఆరూరి నరసింహ, ఆడెపు రమేష్, గడ్డం నర్సిరెడ్డి, సాయిరాం, మామిడి రాములు, మెరుగుమల్ల శ్రీశాంత్, లింగయ్య, మేడి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News