Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:42 PM

డివైఎఫ్ఐ–ఐద్వా ఆధ్వర్యంలో శివాజీ నగర్‌లో ముగ్గుల పోటీలు

డివైఎఫ్ఐ–ఐద్వా ఆధ్వర్యంలో శివాజీ నగర్‌లో ముగ్గుల పోటీలు

డివైఎఫ్ఐ–ఐద్వా ఆధ్వర్యంలో శివాజీ నగర్‌లో ముగ్గుల పోటీలు
January 11, 2026 04:42 PM 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
శివాజీ నగర్‌లో డివైఎఫ్ఐ–ఐద్వా ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు
స్థానికం ప్రధాన ప్రతినిధి

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) మరియు ఐద్వా ఆధ్వర్యంలో శివాజీ నగర్‌లో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ముగ్గులు, క్రీడా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. డివైఎఫ్ఐగా విద్య, ఉపాధి హక్కుల కోసం పోరాటాలు చేస్తూనే, పండుగల వేళ మహిళల ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని చెప్పారు.

యువతకు కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో యూత్ డిక్లరేషన్ ప్రకటించినప్పటికీ, స్వయం ఉపాధికి 10 లక్షల వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగ భృతి రూ.4,000 వంటి హామీలు రెండేళ్లు గడిచినా అమలు కాలేదని విమర్శించారు. హామీల అమలుకోసం డివైఎఫ్ఐ యువతను ఏకం చేసి ఉద్యమాలు చేపడతామని తెలిపారు.ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ మాట్లాడుతూ, మహిళా హక్కులు, రక్షణ కోసం ఐద్వా నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ బహుమతులు అందజేశారు.

ఈ ముగ్గుల పోటీల్లో సుమారు 100 మంది మహిళలు పాల్గొనగా, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను పాండురంగ టెక్స్టైల్స్, కన్సలేషన్ సీ.కే. హాస్పిటల్ వారు అందజేశారు. కార్యక్రమానికి డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గుండాల నరేష్, బాతుక సత్తయ్య అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ సయ్యద్ హషమ్, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, న్యాయవాది శ్యామ్ సుందర్, డివైఎఫ్ఐ నాయకులు రఘువరన్, గంజి రాజేష్, కుమార్, గణేష్, మహేష్, కొమ్ము నాగరాజు, ఐద్వా నాయకురాళ్లు అనురాధ, అంకిత, అనుముల జ్యోతి, సంతోష, గౌరీ, సాయి మానస, రాగం స్వాతి, గీతతో పాటు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News