Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:17 PM

జిల్లా స్థాయి మాక్ UNOలో ప్రతిభ రాష్ట్ర స్థాయికి శివసాయి ఎంపిక

జిల్లా స్థాయి మాక్ UNOలో ప్రతిభ రాష్ట్ర స్థాయికి శివసాయి ఎంపిక

జిల్లా స్థాయి మాక్ UNOలో ప్రతిభ రాష్ట్ర స్థాయికి శివసాయి ఎంపిక
March 10, 2026 06:08 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన మాక్ UNO కార్యక్రమంలో చిట్యాల పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. నల్గొండలో నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ UNO పోటీలలో 9వ తరగతి విద్యార్థి గంజి శివసాయి రాష్ట్ర స్థాయికి ఎంపికై పాఠశాలకు గౌరవం తీసుకొచ్చాడు.

ఈ కార్యక్రమంలో చిట్యాల ఉన్నత పాఠశాల నుంచి 9వ తరగతి విద్యార్థులు జి. శివసాయి, ఎ. సాత్విక్ పాల్గొన్నారు. జిల్లాలోని 40కు పైగా పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. చర్చలు, వాదనలు, అంతర్జాతీయ సమస్యలపై విశ్లేషణలో శివసాయి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు.రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థి శివసాయిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి బి. సుశీల అభినందించారు. ఈ కార్యక్రమానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎన్. సైదులు గైడ్ టీచర్‌గా వ్యవహరించారు.

జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను, రాష్ట్ర స్థాయికి ఎంపికైన శివసాయిని పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ చిలకరాజు శ్రీనివాస్, ఎ. పద్మజ, శ్రీ కోణం శ్రీనివాస్, జి. ఇందిర, ఎ. కవిత, సి.హెచ్. ప్రసన్న, జి. శైలజ, జె. మంజుల, ఎం.డి. సాదిక్, ఎన్. సరళ, పి. తిరుమల అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News