Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

జిల్లా స్థాయి మాక్ UNOలో ప్రతిభ రాష్ట్ర స్థాయికి శివసాయి ఎంపిక

జిల్లా స్థాయి మాక్ UNOలో ప్రతిభ రాష్ట్ర స్థాయికి శివసాయి ఎంపిక

జిల్లా స్థాయి మాక్ UNOలో ప్రతిభ రాష్ట్ర స్థాయికి శివసాయి ఎంపిక
March 10, 2026 06:08 PM 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన మాక్ UNO కార్యక్రమంలో చిట్యాల పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. నల్గొండలో నిర్వహించిన జిల్లా స్థాయి మాక్ UNO పోటీలలో 9వ తరగతి విద్యార్థి గంజి శివసాయి రాష్ట్ర స్థాయికి ఎంపికై పాఠశాలకు గౌరవం తీసుకొచ్చాడు.

ఈ కార్యక్రమంలో చిట్యాల ఉన్నత పాఠశాల నుంచి 9వ తరగతి విద్యార్థులు జి. శివసాయి, ఎ. సాత్విక్ పాల్గొన్నారు. జిల్లాలోని 40కు పైగా పీఎంఎస్‌హెచ్‌ఆర్‌ఐ ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. చర్చలు, వాదనలు, అంతర్జాతీయ సమస్యలపై విశ్లేషణలో శివసాయి ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు.రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థి శివసాయిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి బి. సుశీల అభినందించారు. ఈ కార్యక్రమానికి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎన్. సైదులు గైడ్ టీచర్‌గా వ్యవహరించారు.

జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను, రాష్ట్ర స్థాయికి ఎంపికైన శివసాయిని పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ చిలకరాజు శ్రీనివాస్, ఎ. పద్మజ, శ్రీ కోణం శ్రీనివాస్, జి. ఇందిర, ఎ. కవిత, సి.హెచ్. ప్రసన్న, జి. శైలజ, జె. మంజుల, ఎం.డి. సాదిక్, ఎన్. సరళ, పి. తిరుమల అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News