డీజిల్ కొరతతో నిలిచిన రవాణా
డీజిల్ కొరతతో కోదాడలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం లభించక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన లారీలు రోడ్ల వెంట, పెట్రోల్ బంకుల్లోనే నిలిచిపోయాయి. అటు ఆటోలు సైతం మధ్యలోనే ఆగిపోతుండటంతో ప్రయాణికులు మండుటెండలో నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని, రవాణా ఇబ్బందులను తొలగించాలని డ్రైవర్లు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి