కొత్తగూడెం (రామన్నపేట):
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన కోయగూర మల్లయ్య గత నెల 24న మృతిచెందారు. ఈ సందర్భంగా నేడు ఆయన స్వగ్రామంలో నిర్వహించిన దశదినకర్మకు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన చిరుమర్తి లింగయ్య, మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బంధువులు, పలువురు నాయకులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి