Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 02:11 AM

దశాబ్ది సాహిత్య ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్

దశాబ్ది సాహిత్య ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్

దశాబ్ది సాహిత్య ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్
19-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న “తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్–2026” దశాబ్ది సాహిత్య ఉత్సవాల పోస్టర్‌ను చిట్యాల మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్ ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు ఈనెల 21, 22 తేదీలలో హైదరాబాద్లో జరగనున్నాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యం సమాజ మార్పుకు మార్గదర్శకమని పేర్కొన్నారు. లిటరరీ ఫెస్ట్‌లో కవిత్వం, కథ, నవల, విమర్శలపై విశ్లేషణలతో పాటు మహిళా, యువ సాహిత్యంపై ప్రత్యేక చర్చలు, పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు, ఫోటో ఎగ్జిబిషన్‌లు, పుస్తక ప్రదర్శనలు, పాటలు, నాటక ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

జిల్లా తెలంగాణ సాహితి అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు “డ్రగ్స్ రహిత సమాజం – సుస్థిర భవిష్యత్తు” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు రెండు ప్రోత్సాహక బహుమతులు హైదరాబాద్‌లో జరిగే ఉత్సవాల్లో అందజేయనున్నట్లు చెప్పారు.

జిల్లాలోని సీనియర్ కవులు, రచయితలు,సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.కార్యక్రమంలో చిట్యాల ప్రమోద సాహితీ ప్రధాన కార్యదర్శి తాడూరి చంద్రం, ప్రధానోపాధ్యాయులు అంబటి సత్తయ్య, బాదం బిక్షపతి, కరుణాకర్, వెంకటేశ్వర్లు, జాన్ వరలక్ష్మి, సరిత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దశాబ్ది సాహిత్య ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్

Article Image

తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న “తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్–2026” దశాబ్ది సాహిత్య ఉత్సవాల పోస్టర్‌ను చిట్యాల మండల విద్యాధికారి పానుగోతు సైదా నాయక్ ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు ఈనెల 21, 22 తేదీలలో హైదరాబాద్లో జరగనున్నాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాహిత్యం సమాజ మార్పుకు మార్గదర్శకమని పేర్కొన్నారు. లిటరరీ ఫెస్ట్‌లో కవిత్వం, కథ, నవల, విమర్శలపై విశ్లేషణలతో పాటు మహిళా, యువ సాహిత్యంపై ప్రత్యేక చర్చలు, పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు, ఫోటో ఎగ్జిబిషన్‌లు, పుస్తక ప్రదర్శనలు, పాటలు, నాటక ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయమన్నారు.

జిల్లా తెలంగాణ సాహితి అధ్యక్షులు కుకుడాల గోవర్ధన్ మాట్లాడుతూ, జిల్లా స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు “డ్రగ్స్ రహిత సమాజం – సుస్థిర భవిష్యత్తు” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించామని తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు రెండు ప్రోత్సాహక బహుమతులు హైదరాబాద్‌లో జరిగే ఉత్సవాల్లో అందజేయనున్నట్లు చెప్పారు.

జిల్లాలోని సీనియర్ కవులు, రచయితలు,సాహిత్యాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.కార్యక్రమంలో చిట్యాల ప్రమోద సాహితీ ప్రధాన కార్యదర్శి తాడూరి చంద్రం, ప్రధానోపాధ్యాయులు అంబటి సత్తయ్య, బాదం బిక్షపతి, కరుణాకర్, వెంకటేశ్వర్లు, జాన్ వరలక్ష్మి, సరిత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News