చౌటుప్పల్ మున్సిపల్ లో మోడీ నాయకత్వానికి మద్దతుగా బిజెపిలో చేరికలు
చౌటుప్పల్ మున్సిపల్ లో మోడీ నాయకత్వానికి మద్దతుగా బిజెపిలో చేరికలు
K.RAVI
మసనం సంగీత శ్రీను మసనం లక్ష్మయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు
చౌటుప్పల్, స్థానికం ప్రతినిధి కె రవి
చౌటుప్పల్ మున్సిపాలిటీ 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మసనం శ్రీనివాస్ సంగీత తమ అనుచురతో కలిసి బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, భేతి సుభాష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ వ్యాప్తంగా అనేక పనులు కేంద్ర ప్రభుత్వం ద్వారానే జరిగాయని, సిసి రోడ్డు ఎల్ఈడి లైట్లు అదేవిధంగా అమృత్ స్కీం ద్వారా 20 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్రజల మంచినీటి సమస్యలు తీర్చడానికి మున్సిపాలిటీ అందించిందని తెలియజేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా మసనం శ్రీనివాస్ సంగీత మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వానికి ఆకర్షితులమై నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో చేరామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు దూడల బిక్షం గౌడ్, రమణ గోనీ శంకర్, బాతరాజు సత్యం, శాగ చంద్రశేఖర్ రెడ్డి, గుజ్జుల సురేందర్ రెడ్డి, కడారి కల్పన, పోలోజు శ్రీధర్ బాబు, ఆలే చిరంజీవి,గోశిక పురుషోత్తం, తడక సురేఖ, మోషిక నీరజ, గోశిక ధనుంజయ, చింతకింది సంపత్ గౌడ్, కోడి అశోక్, ఏక్కలి దేవి సంతోష్, ఎర్ర మల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి