Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 01:45 PM

చౌటుప్పల్ లొ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం

చౌటుప్పల్ లొ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం

చౌటుప్పల్ లొ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం
24-01-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కోమిడాల మహేందర్ రెడ్డి

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారు, సీటు బెల్టు లేకుండా కార్లు నడిపే వాహనదారుల్లో మార్పు తీసుకొచ్చేలా చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత పువ్వులు ఇప్పిస్తూ వాహనదారులను చైతన్యపరిచారు.

ఈ సందర్భంగా సీఐ మన్మధకుమార్ మాట్లాడుతూ, చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తోందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల చేత పువ్వులు అందజేయడం ద్వారా వాహనదారుల మనసులను తాకే ప్రయత్నం చేయడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు.

ప్రజల ప్రాణాల పట్ల ఇంతటి శ్రద్ధ చూపుతున్న సీఐ మన్మధకుమార్ లాంటి అధికారులు ఎందరికో ఆదర్శమని పలువురు ప్రశంసించారు. అదే సమయంలో రోడ్లపై గుంతలు, అధ్వాన్నమైన రహదారులపై కూడా పాలకులు, సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరారు. ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతున్న రోడ్ల పరిస్థితులపై కూడా ఇదే తరహా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడ్డారు.

రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని ఈ కార్యక్రమం స్పష్టంగా చాటిచెప్పిందని స్థానికులు తెలిపారు.


Sthanikam

చౌటుప్పల్ లొ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం

Article Image

స్థానికం ప్రతినిధి కోమిడాల మహేందర్ రెడ్డి

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారు, సీటు బెల్టు లేకుండా కార్లు నడిపే వాహనదారుల్లో మార్పు తీసుకొచ్చేలా చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత పువ్వులు ఇప్పిస్తూ వాహనదారులను చైతన్యపరిచారు.

ఈ సందర్భంగా సీఐ మన్మధకుమార్ మాట్లాడుతూ, చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తోందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల చేత పువ్వులు అందజేయడం ద్వారా వాహనదారుల మనసులను తాకే ప్రయత్నం చేయడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు.

ప్రజల ప్రాణాల పట్ల ఇంతటి శ్రద్ధ చూపుతున్న సీఐ మన్మధకుమార్ లాంటి అధికారులు ఎందరికో ఆదర్శమని పలువురు ప్రశంసించారు. అదే సమయంలో రోడ్లపై గుంతలు, అధ్వాన్నమైన రహదారులపై కూడా పాలకులు, సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరారు. ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతున్న రోడ్ల పరిస్థితులపై కూడా ఇదే తరహా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడ్డారు.

రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని ఈ కార్యక్రమం స్పష్టంగా చాటిచెప్పిందని స్థానికులు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News