Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

చౌటుప్పల్ లొ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం

చౌటుప్పల్ లొ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం

చౌటుప్పల్ లొ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం
January 24, 2026 02:25 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కోమిడాల మహేందర్ రెడ్డి

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారు, సీటు బెల్టు లేకుండా కార్లు నడిపే వాహనదారుల్లో మార్పు తీసుకొచ్చేలా చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత పువ్వులు ఇప్పిస్తూ వాహనదారులను చైతన్యపరిచారు.

ఈ సందర్భంగా సీఐ మన్మధకుమార్ మాట్లాడుతూ, చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తోందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల చేత పువ్వులు అందజేయడం ద్వారా వాహనదారుల మనసులను తాకే ప్రయత్నం చేయడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు.

ప్రజల ప్రాణాల పట్ల ఇంతటి శ్రద్ధ చూపుతున్న సీఐ మన్మధకుమార్ లాంటి అధికారులు ఎందరికో ఆదర్శమని పలువురు ప్రశంసించారు. అదే సమయంలో రోడ్లపై గుంతలు, అధ్వాన్నమైన రహదారులపై కూడా పాలకులు, సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరారు. ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతున్న రోడ్ల పరిస్థితులపై కూడా ఇదే తరహా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడ్డారు.

రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని ఈ కార్యక్రమం స్పష్టంగా చాటిచెప్పిందని స్థానికులు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News