Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:57 PM

చౌటుప్పల్ లొ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం

చౌటుప్పల్ లొ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం

చౌటుప్పల్ లొ రోడ్డు భద్రతపై వినూత్న అవగాహన కార్యక్రమం
January 24, 2026 02:25 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కోమిడాల మహేందర్ రెడ్డి

హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారు, సీటు బెల్టు లేకుండా కార్లు నడిపే వాహనదారుల్లో మార్పు తీసుకొచ్చేలా చౌటుప్పల్ సీఐ మన్మధకుమార్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత పువ్వులు ఇప్పిస్తూ వాహనదారులను చైతన్యపరిచారు.

ఈ సందర్భంగా సీఐ మన్మధకుమార్ మాట్లాడుతూ, చిన్న నిర్లక్ష్యం ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తోందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల చేత పువ్వులు అందజేయడం ద్వారా వాహనదారుల మనసులను తాకే ప్రయత్నం చేయడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు.

ప్రజల ప్రాణాల పట్ల ఇంతటి శ్రద్ధ చూపుతున్న సీఐ మన్మధకుమార్ లాంటి అధికారులు ఎందరికో ఆదర్శమని పలువురు ప్రశంసించారు. అదే సమయంలో రోడ్లపై గుంతలు, అధ్వాన్నమైన రహదారులపై కూడా పాలకులు, సంబంధిత అధికారులు దృష్టి సారించాలని కోరారు. ప్రమాదాలకు ప్రధాన కారణంగా మారుతున్న రోడ్ల పరిస్థితులపై కూడా ఇదే తరహా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడ్డారు.

రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే ప్రమాదాలను తగ్గించవచ్చని ఈ కార్యక్రమం స్పష్టంగా చాటిచెప్పిందని స్థానికులు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News