చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముమ్మరం
చిట్యాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం ముమ్మరం
Editor Desk
చిట్యాల, స్థానికం ప్రధాన ప్రతినిధి
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని వేగవంతం చేసింది. మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్యతో కలిసి చిట్యాల ఆరవ వార్డు ఎన్నికల ఇంచార్జి, ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.
ఆరవ వార్డుతో పాటు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకుడు రాస వెంకటేశం, గ్రామ కార్యదర్శి రవ్వ నరసింహతో పాటు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో చిట్యాల మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం రోజురోజుకీ మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి