Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:44 PM

చిట్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు PRPS అభ్యర్థుల పోటీ – నూనె వెంకట్ స్వామి వెల్లడిబహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.) బలపరిచిన ప్రజా పోరాట సమితి (PRPS

చిట్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు PRPS అభ్యర్థుల పోటీ – నూనె వెంకట్ స్వామి వెల్లడిబహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.) బలపరిచిన ప్రజా పోరాట సమితి (PRPS

చిట్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు PRPS అభ్యర్థుల పోటీ – నూనె వెంకట్ స్వామి వెల్లడిబహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.) బలపరిచిన ప్రజా పోరాట సమితి (PRPS
January 11, 2026 04:39 PM 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానికం ప్రధాన ప్రతినిధి

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బి.ఎల్.ఎఫ్.) బలపరిచిన ప్రజా పోరాట సమితి (PRPS) అభ్యర్థులు చిట్యాల మున్సిపాలిటీలోని మొత్తం 12 వార్డులకు కౌన్సిలర్లుగా పోటీ చేస్తున్నట్లు PRPS రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ప్రకటించారు. ఈ మేరకు చిట్యాలలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, తెలంగాణను తొమ్మిదేళ్లు పాలించిన బిఆర్ఎస్ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమవడం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అమలు చేస్తూ దేశంలో మత ఉద్రిక్తతలను పెంచి పోషిస్తున్న బీజేపీ విధానాలను ప్రజలు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పార్టీలను బలపరిచే సీపీఎం, సీపీఐలను కూడా ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని కోరారు.అంబేద్కరిజం, మార్క్సిజం ప్రాతిపదికన సాగుతున్న ఈ పోరాటంలో భాగంగా బహుజన రాజ్యాధికార లక్ష్యంతో PRPS అభ్యర్థులను గెలిపించాలని నూనె వెంకట్ స్వామి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టణ కార్మిక వర్గాన్ని, గ్రామీణ ఉపాధి కూలీలను అణచివేస్తూ మత విద్వేషాలనురెచ్చగొడుతోందని విమర్శించారు. అవినీతి, అధికార దుర్వినియోగానికి ప్రతీకలుగా మారిన కాంగ్రెస్, బిఆర్ఎస్‌లకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని తెలిపారు.ఈ సమావేశానికి ఉయ్యాల లింగస్వామి గౌడ్ అధ్యక్షత వహించగా, నాగిళ్ల యాదయ్య, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, జిట్టా ఉమాశంకర్, దామనూరి కృష్ణ, మిరియాల వెంకటేశం నేత, వల్లమల్ల యాదగిరి, నీల యాదగిరి యాదవ్, గుణగంటి సత్తయ్య గౌడ్, బైరు వెంకన్న గౌడ్, మారుగోని వెంకన్న గౌడ్, శీలోజు వీరప్ప చారి, దాచేపల్లి సంతోష్ గుప్తా, ఏనుగు నరసింహారెడ్డి, గాదె శ్రీహరి, గాదే ఎల్లేష్, కొండే శివ, కొండే నరేష్, ఉండ్రాతి కృష్ణ కుర్రు, ఎస్.కె. నజీర్ భాష, ఎస్.కె. జమాల్, పురం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News