Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:38 PM

చిట్యాలమున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే వేముల వీరేశం విస్తృత ప్రచారం

చిట్యాలమున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే వేముల వీరేశం విస్తృత ప్రచారం

చిట్యాలమున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే వేముల వీరేశం విస్తృత ప్రచారం
February 04, 2026 11:49 AM 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం:

నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం విస్తృత ప్రచారం జరిపారు. 02వ వార్డు అభ్యర్థి జడల పూలమ్మ–మల్లయ్య, 09వ వార్డు అభ్యర్థి ఏర్పుల పరమేష్, 10వ వార్డు అభ్యర్థి సిలువేరు మౌనిక–శేఖర్‌లకు ప్రజలు చేయి గుర్తుకు ఓటు వేయాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ, 02వ వార్డులో అనేక మౌలిక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతిజ్ఞాబద్ధంగా పని చేస్తుందని తెలిపారు. ఇండ్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు జరుగుతుందని, డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైందని గుర్తుచేశారు.తన తొలి దశలోనే 3,500 ఇండ్లను మంజూరు చేసి ప్రతి గ్రామానికి అందించినట్లు చెప్పారు. 2014–2018 మధ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చిట్యాల పట్టణంలో 240 ఇండ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని కూడా గుర్తు చేశారు.గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశాయని విమర్శిస్తూ, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.వార్డులోని ప్రతి సమస్యను పరిష్కరిస్తామని, అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పని చేస్తామని హామీ ఇచ్చారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News