Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:52 AM

చిట్యాలలో ఉత్సాహంగా కామదహనం, రేపు హోలీ సంబరాలకు సిద్ధం

చిట్యాలలో ఉత్సాహంగా కామదహనం, రేపు హోలీ సంబరాలకు సిద్ధం

చిట్యాలలో ఉత్సాహంగా కామదహనం, రేపు హోలీ సంబరాలకు సిద్ధం
02-03-2026 306 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పురపాలక పరిధిలో సోమవారం కామదహనం కార్యక్రమాలు భక్తి, శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం జరగనున్న హోలీ పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామదహనం అనేది చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌహార్ద్రం, సోదరభావం పెంపొందించే పండుగగా హోలీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. రంగుల పండుగను పరస్పర గౌరవంతో, ఎలాంటి అపశృతి లేకుండా జరుపుకోవాలని సూచించారు.పురపాలక ప్రాంత ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ పద్ధతుల్లో పండుగను నిర్వహించాలని, యువత ప్రత్యేకంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. భక్తి, ఆనందాల మధ్య హోలీ సంబరాలు చిట్యాలలో మరింత వైభవంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ధూప దీప నైవేద్యాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నగర ప్రజలు సామాజిక ఐక్యతను చాటుతూ పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

చిట్యాలలో ఉత్సాహంగా కామదహనం, రేపు హోలీ సంబరాలకు సిద్ధం

Article Image

చిట్యాల పురపాలక పరిధిలో సోమవారం కామదహనం కార్యక్రమాలు భక్తి, శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించనున్నారు. మంగళవారం జరగనున్న హోలీ పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కామదహనం అనేది చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌహార్ద్రం, సోదరభావం పెంపొందించే పండుగగా హోలీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. రంగుల పండుగను పరస్పర గౌరవంతో, ఎలాంటి అపశృతి లేకుండా జరుపుకోవాలని సూచించారు.పురపాలక ప్రాంత ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ పద్ధతుల్లో పండుగను నిర్వహించాలని, యువత ప్రత్యేకంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. భక్తి, ఆనందాల మధ్య హోలీ సంబరాలు చిట్యాలలో మరింత వైభవంగా నిలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ధూప దీప నైవేద్యాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నగర ప్రజలు సామాజిక ఐక్యతను చాటుతూ పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News