Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 10:12 AM

చిట్యాలలో రాత్రి రోడ్డు ప్రమాదం – బైకర్ తీవ్ర గాయాలు

చిట్యాలలో రాత్రి రోడ్డు ప్రమాదం – బైకర్ తీవ్ర గాయాలు

చిట్యాలలో రాత్రి రోడ్డు ప్రమాదం – బైకర్   తీవ్ర గాయాలు
20-03-2026 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని భువనగిరి రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన నితిన్ అనే యువకుడు రామన్నపేట నుండి చిట్యాల వైపు తన వాహనంపై వస్తున్నాడు.

ఈ క్రమంలో భువనగిరి రోడ్డులో ఎదురుగా వస్తున్న మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన డీసీఎం వాహనం నితిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నితిన్ గాయపడ్డాడు.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన నితిన్‌ను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Sthanikam

చిట్యాలలో రాత్రి రోడ్డు ప్రమాదం – బైకర్ తీవ్ర గాయాలు

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని భువనగిరి రోడ్డులో ఉన్న భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన నితిన్ అనే యువకుడు రామన్నపేట నుండి చిట్యాల వైపు తన వాహనంపై వస్తున్నాడు.

ఈ క్రమంలో భువనగిరి రోడ్డులో ఎదురుగా వస్తున్న మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన డీసీఎం వాహనం నితిన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నితిన్ గాయపడ్డాడు.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన నితిన్‌ను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News