PRINT TIME: May 26, 2026 06:37 PM
చిట్యాలలో కౌన్సిలర్ శ్రీనివాస్ కు ఘన సన్మానం
చిట్యాలలో కౌన్సిలర్ శ్రీనివాస్ కు ఘన సన్మానం
February 19, 2026 12:38 AM
17 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా విజయం సాధించిన నిమ్మనగోటి శ్రీనివాస్కు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏరుకొండల వెంకటేశం, ఇతర సంఘం నాయకులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ సంఘం ప్రతినిధులు, రాజకీయ రంగంలో కుమ్మరుల ప్రాతినిధ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని, సామాజిక ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
కౌన్సిలర్ శ్రీనివాస్ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పట్టణాభివృద్ధితో పాటు కుమ్మరుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కుమ్మర సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి