చిట్యాలలో కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాద మహోత్సవం
చిట్యాలలో కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాద మహోత్సవం
Editor Desk
కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాదం పంపిణీ
చిట్యాలలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
చిట్యాల మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ దేవి అమ్మవారి ఆలయంలో శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహాప్రసాద పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గురుస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తన ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప స్వామి మహాప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.
అయ్యప్ప స్వామి దీక్ష మండల కాల పూజలు పూర్తి చేసి శబరిమలలో మకరజ్యోతి దర్శనం చేసుకున్న అనంతరం, ఈ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని గురుస్వామి ప్రార్థించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు మంచి జీవితం గడపాలని ఆకాంక్షించారు.ఈ ప్రత్యేక పూజా–ప్రసాద పంపిణీ కార్యక్రమంలో ఆలయ పూజారి గోవిందు మిశ్రా, భాస్కర్, హరీష్ రెడ్డి, లింగస్వామి, నరసింహ, కృష్ణయ్య, మహేష్, వెంకన్న తదితర భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి