Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:07 PM

చిట్యాలలో కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాద మహోత్సవం

చిట్యాలలో కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాద మహోత్సవం

చిట్యాలలో కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాద మహోత్సవం
January 18, 2026 03:31 PM 304 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కనకదుర్గ ఆలయంలో అయ్యప్ప మహాప్రసాదం పంపిణీ

చిట్యాలలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

చిట్యాల మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ దేవి అమ్మవారి ఆలయంలో శ్రీశ్రీశ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి మహాప్రసాద పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్, నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు గురుస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తన ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప స్వామి మహాప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.

అయ్యప్ప స్వామి దీక్ష మండల కాల పూజలు పూర్తి చేసి శబరిమలలో మకరజ్యోతి దర్శనం చేసుకున్న అనంతరం, ఈ ప్రాంత ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని, అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని గురుస్వామి ప్రార్థించారు. పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు మంచి జీవితం గడపాలని ఆకాంక్షించారు.ఈ ప్రత్యేక పూజా–ప్రసాద పంపిణీ కార్యక్రమంలో ఆలయ పూజారి గోవిందు మిశ్రా, భాస్కర్, హరీష్ రెడ్డి, లింగస్వామి, నరసింహ, కృష్ణయ్య, మహేష్, వెంకన్న తదితర భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News