చిట్యాల పట్టణ కేంద్రంలో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్రంగా మారింది. ముఖ్యంగా ఎన్హెచ్-65 పరిధిలోని దాదాపు అన్ని పెట్రోల్ బంక్లలో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించడం వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది. అత్యవసర అవసరాల కోసం వచ్చిన వారు ఇంధనం దొరకక నిరాశతో వెనుదిరుగుతున్నారు.
ఇదే సమయంలో చిట్యాల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో మాత్రమే కొంతమేర స్టాక్ అందుబాటులో ఉండటంతో, అక్కడికి భారీగా వాహనాలు చేరుతున్నాయి. ఫలితంగా బంక్ వద్ద పొడవైన క్యూలు ఏర్పడింది. ఉదయం నుంచి వాహనదారులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. కొరతకు కారణాలపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా సరఫరా సాధారణ స్థితికి తీసుకురావాలని వాహనదారులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి