Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:33 AM

చిట్యాల వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు స్వయం విక్రయ వేదిక దళారుల మోసాలకు చెక్

చిట్యాల వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు స్వయం విక్రయ వేదిక దళారుల మోసాలకు చెక్

చిట్యాల వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు స్వయం విక్రయ వేదిక దళారుల మోసాలకు చెక్
March 13, 2026 11:21 AM 295 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణానికి చెందిన రావుల వెంకట రెడ్డి తన రిటైల్ కూరగాయల దుకాణంలో రైతులు స్వయంగా పండించిన కూరగాయలను నేరుగా తీసుకొచ్చి అమ్ముకునే సౌకర్యాన్ని కల్పించారు.సాధారణంగా రైతులు తమ పంటలను దళారుల ద్వారా అమ్మాల్సి రావడంతో సరైన ధర లభించక మోసపోతున్న సందర్భాలు తరచూ కనిపిస్తున్నాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని రైతులకు నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశాన్ని ఇవ్వాలని రావుల వెంకట రెడ్డి ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు.

రైతులు తమ పొలాల్లో పండించిన తాజా కూరగాయలను చిట్యాల కూరగాయల మార్కెట్‌కు తీసుకువచ్చి, ఆ దుకాణంలో ఏర్పాటు చేసిన స్థలంలో స్వయంగా అమ్ముకోవచ్చు. దీంతో మధ్యవర్తులు లేకుండా రైతులకు మంచి ధర లభించడంతో పాటు వినియోగదారులకు కూడా నాణ్యమైన కూరగాయలు అందుబాటులోకి వస్తాయని స్థానికులుఅభిప్రాయపడుతున్నారు.కూరగాయలు పండించే రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దళారుల వద్దకు వెళ్లి నష్టపోకుండా, నేరుగా తమ పంటలను అమ్ముకోవాలని రావుల వెంకట రెడ్డి కోరారు. స్థానికంగా ఈ ప్రయత్నం రైతులకు మేలు చేసే విధంగా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News