Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:30 PM

చిట్యాల వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు స్వయం విక్రయ వేదిక దళారుల మోసాలకు చెక్

చిట్యాల వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు స్వయం విక్రయ వేదిక దళారుల మోసాలకు చెక్

చిట్యాల వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు స్వయం విక్రయ వేదిక దళారుల మోసాలకు చెక్
March 13, 2026 11:21 AM 291 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు ఉపయోగపడే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణానికి చెందిన రావుల వెంకట రెడ్డి తన రిటైల్ కూరగాయల దుకాణంలో రైతులు స్వయంగా పండించిన కూరగాయలను నేరుగా తీసుకొచ్చి అమ్ముకునే సౌకర్యాన్ని కల్పించారు.సాధారణంగా రైతులు తమ పంటలను దళారుల ద్వారా అమ్మాల్సి రావడంతో సరైన ధర లభించక మోసపోతున్న సందర్భాలు తరచూ కనిపిస్తున్నాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని రైతులకు నేరుగా వినియోగదారులకు అమ్ముకునే అవకాశాన్ని ఇవ్వాలని రావుల వెంకట రెడ్డి ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు.

రైతులు తమ పొలాల్లో పండించిన తాజా కూరగాయలను చిట్యాల కూరగాయల మార్కెట్‌కు తీసుకువచ్చి, ఆ దుకాణంలో ఏర్పాటు చేసిన స్థలంలో స్వయంగా అమ్ముకోవచ్చు. దీంతో మధ్యవర్తులు లేకుండా రైతులకు మంచి ధర లభించడంతో పాటు వినియోగదారులకు కూడా నాణ్యమైన కూరగాయలు అందుబాటులోకి వస్తాయని స్థానికులుఅభిప్రాయపడుతున్నారు.కూరగాయలు పండించే రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని దళారుల వద్దకు వెళ్లి నష్టపోకుండా, నేరుగా తమ పంటలను అమ్ముకోవాలని రావుల వెంకట రెడ్డి కోరారు. స్థానికంగా ఈ ప్రయత్నం రైతులకు మేలు చేసే విధంగా ఉందని పలువురు ప్రశంసిస్తున్నారు.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News