Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

చిట్యాల పట్టణంలో నీటి కష్టాలు ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు

చిట్యాల పట్టణంలో నీటి కష్టాలు ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు

చిట్యాల పట్టణంలో నీటి కష్టాలు ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు
March 19, 2026 10:08 AM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలో నీటి కష్టాలు ముదురుతున్నాయి

ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు – శాశ్వత పరిష్కారం కోరుతున్న పట్టణవాసులు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలం ప్రారంభం కావడంతో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. సరైన నీటి సరఫరా లేకపోవడంతో పట్టణ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ అవసరాలు కూడా నెరవేర్చుకోలేని పరిస్థితి నెలకొంది.

ప్రత్యేకంగా పలు వార్డుల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్, 11వ వార్డు కౌన్సిలర్ బొబ్బలి సందీప్ రామ్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ షబానా అజీమ్ తమ తమ పరిధిలో ప్రజలు నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

అయితే ఇది తాత్కాలిక పరిష్కారమే తప్ప, శాశ్వత పరిష్కారం కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రానున్న వేసవికాలంలో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని చిట్యాల పట్టణానికి సరిపడే విధంగా నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత నీటి వనరుల అభివృద్ధి, పైప్‌లైన్ వ్యవస్థ మెరుగుదల వంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News