Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 10:19 AM

చిట్యాల పట్టణంలో నీటి కష్టాలు ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు

చిట్యాల పట్టణంలో నీటి కష్టాలు ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు

చిట్యాల పట్టణంలో నీటి కష్టాలు ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు
19-03-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలో నీటి కష్టాలు ముదురుతున్నాయి

ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు – శాశ్వత పరిష్కారం కోరుతున్న పట్టణవాసులు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలం ప్రారంభం కావడంతో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. సరైన నీటి సరఫరా లేకపోవడంతో పట్టణ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ అవసరాలు కూడా నెరవేర్చుకోలేని పరిస్థితి నెలకొంది.

ప్రత్యేకంగా పలు వార్డుల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్, 11వ వార్డు కౌన్సిలర్ బొబ్బలి సందీప్ రామ్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ షబానా అజీమ్ తమ తమ పరిధిలో ప్రజలు నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

అయితే ఇది తాత్కాలిక పరిష్కారమే తప్ప, శాశ్వత పరిష్కారం కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రానున్న వేసవికాలంలో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని చిట్యాల పట్టణానికి సరిపడే విధంగా నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత నీటి వనరుల అభివృద్ధి, పైప్‌లైన్ వ్యవస్థ మెరుగుదల వంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Sthanikam

చిట్యాల పట్టణంలో నీటి కష్టాలు ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు

Article Image

చిట్యాల పట్టణంలో నీటి కష్టాలు ముదురుతున్నాయి

ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు – శాశ్వత పరిష్కారం కోరుతున్న పట్టణవాసులు

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలం ప్రారంభం కావడంతో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. సరైన నీటి సరఫరా లేకపోవడంతో పట్టణ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ అవసరాలు కూడా నెరవేర్చుకోలేని పరిస్థితి నెలకొంది.

ప్రత్యేకంగా పలు వార్డుల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్, 11వ వార్డు కౌన్సిలర్ బొబ్బలి సందీప్ రామ్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ షబానా అజీమ్ తమ తమ పరిధిలో ప్రజలు నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.

అయితే ఇది తాత్కాలిక పరిష్కారమే తప్ప, శాశ్వత పరిష్కారం కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రానున్న వేసవికాలంలో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని చిట్యాల పట్టణానికి సరిపడే విధంగా నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత నీటి వనరుల అభివృద్ధి, పైప్‌లైన్ వ్యవస్థ మెరుగుదల వంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News