చిట్యాల పట్టణంలో నీటి కష్టాలు ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు
చిట్యాల పట్టణంలో నీటి కష్టాలు ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు
Komidala Mahender reddy
చిట్యాల పట్టణంలో నీటి కష్టాలు ముదురుతున్నాయి
ట్యాంకర్లపై ఆధారపడుతున్న ప్రజలు – శాశ్వత పరిష్కారం కోరుతున్న పట్టణవాసులు
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వేసవికాలం ప్రారంభం కావడంతో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. సరైన నీటి సరఫరా లేకపోవడంతో పట్టణ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజువారీ అవసరాలు కూడా నెరవేర్చుకోలేని పరిస్థితి నెలకొంది.
ప్రత్యేకంగా పలు వార్డుల్లో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. 8వ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్, 11వ వార్డు కౌన్సిలర్ బొబ్బలి సందీప్ రామ్ రెడ్డి, 2వ వార్డు కౌన్సిలర్ షబానా అజీమ్ తమ తమ పరిధిలో ప్రజలు నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
అయితే ఇది తాత్కాలిక పరిష్కారమే తప్ప, శాశ్వత పరిష్కారం కాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రానున్న వేసవికాలంలో నీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుని చిట్యాల పట్టణానికి సరిపడే విధంగా నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని పట్టణవాసులు డిమాండ్ చేస్తున్నారు. శాశ్వత నీటి వనరుల అభివృద్ధి, పైప్లైన్ వ్యవస్థ మెరుగుదల వంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి