Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 06:27 PM

చిట్యాల మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

చిట్యాల మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

చిట్యాల మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
February 23, 2026 05:05 PM 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

స్వంత నిధులతో పనులు చేపట్టిన వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ – ప్రజల ప్రశంసలు

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డు సంజీవ్ నగర్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ ముందడుగు వేసి సమస్య నివారణకు చర్యలు చేపట్టారు.

మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో యంత్రాల ద్వారా మురుగు కాల్వలను శుభ్రపరిచారు. సెప్టిక్ ట్యాంకర్ ద్వారా నిల్వైన మురుగునీటిని పూర్తిగా తొలగించడంతో ప్రాంతంలో నెలకొన్న దుర్వాసన, దోమల సమస్యలు తగ్గుముఖం పట్టాయి. ఈ పనులను కౌన్సిలర్ స్వంత నిధులతో నిర్వహించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా కుక్కల మోహన్ మాట్లాడుతూ, వార్డులో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సమస్యల రహితంగా, పరిశుభ్రమైన వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.సమస్య పరిష్కారానికి స్వయంగా నిధులు వెచ్చించి పనులు చేయించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై స్పందించే ప్రజాప్రతినిధులు అవసరమని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శేపూరి యాదయ్య, పాల సహకార సంఘం చైర్మన్ జిట్టా రవి, అమరోజు మదన్, బోయ సురేష్, జిట్ట సాయి, జిట్ట కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News