Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:36 PM

చిట్యాల మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

చిట్యాల మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం

చిట్యాల మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం
February 23, 2026 05:05 PM 224 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్వంత నిధులతో పనులు చేపట్టిన వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ – ప్రజల ప్రశంసలు

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డు సంజీవ్ నగర్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ ముందడుగు వేసి సమస్య నివారణకు చర్యలు చేపట్టారు.

మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది సహకారంతో యంత్రాల ద్వారా మురుగు కాల్వలను శుభ్రపరిచారు. సెప్టిక్ ట్యాంకర్ ద్వారా నిల్వైన మురుగునీటిని పూర్తిగా తొలగించడంతో ప్రాంతంలో నెలకొన్న దుర్వాసన, దోమల సమస్యలు తగ్గుముఖం పట్టాయి. ఈ పనులను కౌన్సిలర్ స్వంత నిధులతో నిర్వహించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా కుక్కల మోహన్ మాట్లాడుతూ, వార్డులో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సమస్యల రహితంగా, పరిశుభ్రమైన వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.సమస్య పరిష్కారానికి స్వయంగా నిధులు వెచ్చించి పనులు చేయించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై స్పందించే ప్రజాప్రతినిధులు అవసరమని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శేపూరి యాదయ్య, పాల సహకార సంఘం చైర్మన్ జిట్టా రవి, అమరోజు మదన్, బోయ సురేష్, జిట్ట సాయి, జిట్ట కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News