Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:59 PM

చిట్యాల మున్సిపాలిటీ బిఆర్ఎస్ అభ్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన వేముల వీరేశం

చిట్యాల మున్సిపాలిటీ బిఆర్ఎస్ అభ్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన వేముల వీరేశం

చిట్యాల మున్సిపాలిటీ బిఆర్ఎస్ అభ్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన వేముల వీరేశం
February 09, 2026 09:03 PM 183 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీలో అక్రమాల రాజకీయం – బిఆర్ఎస్ పాలనపై ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైర్

చిట్యాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పాలన అక్రమాలకు అడ్డాగా మారిందని ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ అభ్యర్థులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు.

గడిచిన ఐదేళ్లుగా ఈ నియోజకవర్గాన్ని పేకాట క్లబ్‌లకు కేంద్రంగా మార్చారని, గంజాయి దందాలు బహిరంగంగా సాగాయని వేముల వీరేశం ఆరోపించారు. “చిట్యాల ప్రజలు ప్రశ్నించాలి… ఈ అక్రమాలన్నీ ఎవరి హయాంలో జరిగాయి? ఎవరి రాజకీయ రక్షణతో గంజాయి మాఫియా రెచ్చిపోయింది?” అంటూ బిఆర్ఎస్ నేతలను నిలదీశారు.

రౌడీ షీటర్లకు రాజకీయ అండదండలిచ్చి భయభ్రాంతులకు గురిచేసిన పాలన బిఆర్ఎస్‌దేనని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి, అక్రమ సంపాదనలే లక్ష్యంగా మున్సిపాలిటీలో పాలన సాగిందని ఆరోపించారు. యువతను నాశనం చేసే సంస్కృతిని ప్రోత్సహించిన వారే నేడు అభివృద్ధి పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

చిట్యాల మున్సిపాలిటీలో కనీస మౌలిక వసతులు లేవని, డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు సమస్యలపై బిఆర్ఎస్ పాలకులు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. అక్రమాలు–దందాలకే ప్రాధాన్యం ఇచ్చిన పాలనను ప్రజలు ఇక సహించబోరని స్పష్టం చేశారు.అయితే, ఎమ్మెల్యే ఆరోపణలను బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ రాజకీయ కక్షతో చేస్తున్న వ్యాఖ్యలేనని, తమ పాలనలోనే చిట్యాలకు అభివృద్ధి జరిగిందని వారు అంటున్నారు.మొత్తానికి చిట్యాల మున్సిపాలిటీ రాజకీయాలు ఇప్పుడు ఆరోపణల మోతతో హోరెత్తుతున్నాయి. అక్రమాల ఆరోపణల మధ్య నిజమెవరిదో తేల్చేది ప్రజలే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News