చిట్యాల మున్సిపాలిటీ బిఆర్ఎస్ అభ్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన వేముల వీరేశం
చిట్యాల మున్సిపాలిటీ బిఆర్ఎస్ అభ్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన వేముల వీరేశం
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీలో అక్రమాల రాజకీయం – బిఆర్ఎస్ పాలనపై ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైర్
చిట్యాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పాలన అక్రమాలకు అడ్డాగా మారిందని ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ అభ్యర్థులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు.
గడిచిన ఐదేళ్లుగా ఈ నియోజకవర్గాన్ని పేకాట క్లబ్లకు కేంద్రంగా మార్చారని, గంజాయి దందాలు బహిరంగంగా సాగాయని వేముల వీరేశం ఆరోపించారు. “చిట్యాల ప్రజలు ప్రశ్నించాలి… ఈ అక్రమాలన్నీ ఎవరి హయాంలో జరిగాయి? ఎవరి రాజకీయ రక్షణతో గంజాయి మాఫియా రెచ్చిపోయింది?” అంటూ బిఆర్ఎస్ నేతలను నిలదీశారు.
రౌడీ షీటర్లకు రాజకీయ అండదండలిచ్చి భయభ్రాంతులకు గురిచేసిన పాలన బిఆర్ఎస్దేనని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి, అక్రమ సంపాదనలే లక్ష్యంగా మున్సిపాలిటీలో పాలన సాగిందని ఆరోపించారు. యువతను నాశనం చేసే సంస్కృతిని ప్రోత్సహించిన వారే నేడు అభివృద్ధి పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.
చిట్యాల మున్సిపాలిటీలో కనీస మౌలిక వసతులు లేవని, డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు సమస్యలపై బిఆర్ఎస్ పాలకులు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. అక్రమాలు–దందాలకే ప్రాధాన్యం ఇచ్చిన పాలనను ప్రజలు ఇక సహించబోరని స్పష్టం చేశారు.అయితే, ఎమ్మెల్యే ఆరోపణలను బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ రాజకీయ కక్షతో చేస్తున్న వ్యాఖ్యలేనని, తమ పాలనలోనే చిట్యాలకు అభివృద్ధి జరిగిందని వారు అంటున్నారు.మొత్తానికి చిట్యాల మున్సిపాలిటీ రాజకీయాలు ఇప్పుడు ఆరోపణల మోతతో హోరెత్తుతున్నాయి. అక్రమాల ఆరోపణల మధ్య నిజమెవరిదో తేల్చేది ప్రజలే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి