Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:37 PM

చిట్యాల మున్సిపాలిటీ బిఆర్ఎస్ అభ్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన వేముల వీరేశం

చిట్యాల మున్సిపాలిటీ బిఆర్ఎస్ అభ్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన వేముల వీరేశం

చిట్యాల మున్సిపాలిటీ బిఆర్ఎస్ అభ్యర్థులపై ఘాటైన విమర్శలు చేసిన వేముల వీరేశం
February 09, 2026 09:03 PM 185 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీలో అక్రమాల రాజకీయం – బిఆర్ఎస్ పాలనపై ఎమ్మెల్యే వేముల వీరేశం ఫైర్

చిట్యాల మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పాలన అక్రమాలకు అడ్డాగా మారిందని ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిఆర్ఎస్ అభ్యర్థులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు.

గడిచిన ఐదేళ్లుగా ఈ నియోజకవర్గాన్ని పేకాట క్లబ్‌లకు కేంద్రంగా మార్చారని, గంజాయి దందాలు బహిరంగంగా సాగాయని వేముల వీరేశం ఆరోపించారు. “చిట్యాల ప్రజలు ప్రశ్నించాలి… ఈ అక్రమాలన్నీ ఎవరి హయాంలో జరిగాయి? ఎవరి రాజకీయ రక్షణతో గంజాయి మాఫియా రెచ్చిపోయింది?” అంటూ బిఆర్ఎస్ నేతలను నిలదీశారు.

రౌడీ షీటర్లకు రాజకీయ అండదండలిచ్చి భయభ్రాంతులకు గురిచేసిన పాలన బిఆర్ఎస్‌దేనని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలు పక్కనపెట్టి, అక్రమ సంపాదనలే లక్ష్యంగా మున్సిపాలిటీలో పాలన సాగిందని ఆరోపించారు. యువతను నాశనం చేసే సంస్కృతిని ప్రోత్సహించిన వారే నేడు అభివృద్ధి పేరుతో ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.

చిట్యాల మున్సిపాలిటీలో కనీస మౌలిక వసతులు లేవని, డ్రైనేజీలు, రోడ్లు, తాగునీరు సమస్యలపై బిఆర్ఎస్ పాలకులు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. అక్రమాలు–దందాలకే ప్రాధాన్యం ఇచ్చిన పాలనను ప్రజలు ఇక సహించబోరని స్పష్టం చేశారు.అయితే, ఎమ్మెల్యే ఆరోపణలను బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇవన్నీ రాజకీయ కక్షతో చేస్తున్న వ్యాఖ్యలేనని, తమ పాలనలోనే చిట్యాలకు అభివృద్ధి జరిగిందని వారు అంటున్నారు.మొత్తానికి చిట్యాల మున్సిపాలిటీ రాజకీయాలు ఇప్పుడు ఆరోపణల మోతతో హోరెత్తుతున్నాయి. అక్రమాల ఆరోపణల మధ్య నిజమెవరిదో తేల్చేది ప్రజలే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News