చిట్యాల మార్కెట్ అభివృద్ధికి శ్రీకారం – రూ.1.65 కోట్ల పనులకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన
చిట్యాల మార్కెట్ అభివృద్ధికి శ్రీకారం – రూ.1.65 కోట్ల పనులకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన
Komidala Mahender reddy
నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల పట్టణ మార్కెట్ యార్డులో రూ.1.65 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో రూ.1 కోట్ల వ్యయంతో మార్కెట్ కార్యాలయం నిర్మాణం, రూ.65 లక్షలతో సీసీ రోడ్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు చౌటుప్పల్ మార్కెట్ పరిధిలో ఉన్న చిట్యాల మండలంలోని 11 గ్రామాలను చిట్యాల మార్కెట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం రైతులకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.
కార్యక్రమంలో డైయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ నర్రా వినోద్-మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పందిరి గీత-రమేష్, కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి