Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు సత్తుపల్లి అసెంబ్లీలో కాంగ్రెస్ బూత్ స్థాయి ఏజెంట్ల నియామక సన్నాహక సమావేశం నరాలు తెగే ఉత్కంఠ... ఢిల్లీ చేతిలో గెలుపు.. గుజరాత్ తన్నుకుపోయింది! “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 09, 2026 02:17 PM

చిట్యాల మార్కెట్ అభివృద్ధికి శ్రీకారం – రూ.1.65 కోట్ల పనులకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన

చిట్యాల మార్కెట్ అభివృద్ధికి శ్రీకారం – రూ.1.65 కోట్ల పనులకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన

చిట్యాల మార్కెట్ అభివృద్ధికి శ్రీకారం – రూ.1.65 కోట్ల పనులకు ఎమ్మెల్యే వీరేశం శంకుస్థాపన
April 09, 2026 12:33 PM 67 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల పట్టణ మార్కెట్ యార్డులో రూ.1.65 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో రూ.1 కోట్ల వ్యయంతో మార్కెట్ కార్యాలయం నిర్మాణం, రూ.65 లక్షలతో సీసీ రోడ్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు చౌటుప్పల్ మార్కెట్ పరిధిలో ఉన్న చిట్యాల మండలంలోని 11 గ్రామాలను చిట్యాల మార్కెట్‌లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం రైతులకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.

కార్యక్రమంలో డైయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ నర్రా వినోద్-మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పందిరి గీత-రమేష్, కౌన్సిలర్లు, మార్కెట్ డైరెక్టర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News