చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు అంబేద్కర్ నగర్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ముఖ్య అతిథిగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యమయ్యారు. ఆయనతో పాటు ప్రస్తుత కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.
కళ్యాణోత్సవం సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహించగా, భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
స్థానిక ప్రజలు, నాయకులు సమన్వయంతో కార్యక్రమాన్ని ఘనవిజయవంతం చేయడం విశేషంగా నిలిచింది.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి