Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ.. చెల్లికి కానుక అందించిన ఎంపీ షేట్కార్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:54 PM

చిట్యాల 11వ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల 11వ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల 11వ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే  చిరుమర్తి లింగయ్య
06-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 11వ వార్డులో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ అభ్యర్థి మారగోని తేజస్విని మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ, బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, స్థానికంగా అమలైన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. ముఖ్యంగా మహిళలు, యువత నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థి మారగోని తేజస్విని హామీ ఇచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. వార్డు అభివృద్ధి కోసం అనుభవం, నాయకత్వం అవసరమని, అందుకే బిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వారు ఓటర్లను కోరారు.

Sthanikam

చిట్యాల 11వ వార్డులో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

నల్లగొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గం పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీ 11వ వార్డులో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ అభ్యర్థి మారగోని తేజస్విని మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ, బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, స్థానికంగా అమలైన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. ముఖ్యంగా మహిళలు, యువత నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ నాయకులు తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అభ్యర్థి మారగోని తేజస్విని హామీ ఇచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు. వార్డు అభివృద్ధి కోసం అనుభవం, నాయకత్వం అవసరమని, అందుకే బిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని వారు ఓటర్లను కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News