Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:47 PM

చిన్నారిపై అత్యాచారం… రాజీ లేని శిక్ష అవసరం. జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్

చిన్నారిపై అత్యాచారం… రాజీ లేని శిక్ష అవసరం. జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్

చిన్నారిపై అత్యాచారం… రాజీ లేని శిక్ష అవసరం. జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్
14-01-2026 233 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి:స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పెంచికల్ పహాడ్‌లో ఐదేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కఠిన శిక్షతో పాటు ఉరి శిక్ష విధించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అభం శుభం తెలియని పసిపిల్లలను చాక్లెట్లు, బిస్కెట్లు ఆశచూపి నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచారాలకు పాల్పడటం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, 12 ఏళ్ల లోపు పిల్లలపై అత్యాచారం చేసిన వారికి ఉరి శిక్ష విధించాలన్న సుప్రీంకోర్టు తీర్పును కఠినంగా అమలు చేయాలని కోరారు.డాక్టర్ నివేదిక ఆధారంగా శిక్ష విధించాలని, సాక్ష్యాల లోపాల పేరిట నిందితులు తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదని అన్నారు. మంగళవారం అత్యాచారానికి గురై జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న ఆయన, చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక బాలిక తల్లిదండ్రులకు అండగా ఉంటుందని తెలిపారు.చిన్నారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Sthanikam

చిన్నారిపై అత్యాచారం… రాజీ లేని శిక్ష అవసరం. జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్

Article Image

భువనగిరి:స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పెంచికల్ పహాడ్‌లో ఐదేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కఠిన శిక్షతో పాటు ఉరి శిక్ష విధించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అభం శుభం తెలియని పసిపిల్లలను చాక్లెట్లు, బిస్కెట్లు ఆశచూపి నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచారాలకు పాల్పడటం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, 12 ఏళ్ల లోపు పిల్లలపై అత్యాచారం చేసిన వారికి ఉరి శిక్ష విధించాలన్న సుప్రీంకోర్టు తీర్పును కఠినంగా అమలు చేయాలని కోరారు.డాక్టర్ నివేదిక ఆధారంగా శిక్ష విధించాలని, సాక్ష్యాల లోపాల పేరిట నిందితులు తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదని అన్నారు. మంగళవారం అత్యాచారానికి గురై జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న ఆయన, చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక బాలిక తల్లిదండ్రులకు అండగా ఉంటుందని తెలిపారు.చిన్నారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News