Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:54 AM

చిన్నారిపై అత్యాచారం… రాజీ లేని శిక్ష అవసరం. జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్

చిన్నారిపై అత్యాచారం… రాజీ లేని శిక్ష అవసరం. జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్

చిన్నారిపై అత్యాచారం… రాజీ లేని శిక్ష అవసరం. జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్
January 14, 2026 06:29 PM 222 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి:స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పెంచికల్ పహాడ్‌లో ఐదేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి కఠిన శిక్షతో పాటు ఉరి శిక్ష విధించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

అభం శుభం తెలియని పసిపిల్లలను చాక్లెట్లు, బిస్కెట్లు ఆశచూపి నిర్జన ప్రదేశాలకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచారాలకు పాల్పడటం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, 12 ఏళ్ల లోపు పిల్లలపై అత్యాచారం చేసిన వారికి ఉరి శిక్ష విధించాలన్న సుప్రీంకోర్టు తీర్పును కఠినంగా అమలు చేయాలని కోరారు.డాక్టర్ నివేదిక ఆధారంగా శిక్ష విధించాలని, సాక్ష్యాల లోపాల పేరిట నిందితులు తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదని అన్నారు. మంగళవారం అత్యాచారానికి గురై జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న ఆయన, చిన్నారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. బాలల హక్కుల పరిరక్షణ వేదిక బాలిక తల్లిదండ్రులకు అండగా ఉంటుందని తెలిపారు.చిన్నారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News