Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:40 AM

చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి కేంద్రాలే : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి కేంద్రాలే : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి కేంద్రాలే : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
January 20, 2026 05:30 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
యాదగిరిగుట్ట, స్థానికం ప్రధాన ప్రతినిధి

అంగన్వాడి కేంద్రాలు చిన్నారుల ఆరోగ్యం, పోషణ, ప్రాథమిక విద్యకు పునాదిగా నిలుస్తాయని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం నూతన అంగన్వాడి భవనాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.

మంగళవారం యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో సైదాపురం–1, సైదాపురం–2 అంగన్వాడి కేంద్రాలకు నూతనంగా నిర్మించిన భవనాలను మంత్రి ప్రారంభించారు. ఎస్‌డీఎఫ్, డీఎంఎఫ్ నిధులతో ఒక్కొక్క కేంద్రానికి రూ.15 లక్షల చొప్పున ఈ భవనాలు నిర్మించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ నూతన అంగన్వాడి భవనాల ద్వారా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, అంగన్వాడి వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమన్నారు.

అనంతరం నూతనంగా నిర్మించిన అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి చిన్నారులతో ముచ్చటించి, వారి సంక్షేమ వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అంగన్వాడి సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News