Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:38 AM

చిన్నకాపర్తి రైతులకు ఊరట.

చిన్నకాపర్తి రైతులకు ఊరట.

చిన్నకాపర్తి రైతులకు ఊరట.
11-04-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

.ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రహదారి సమస్యకు పరిష్కారం.

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నెలకొన్న రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారం అందించగా, స్థానిక సర్పంచ్ మరియు రైతుల చొరవ కీలకంగా మారింది.

కొనుగోలు కేంద్రం సమీపంలో భూమి కలిగిన రైతు ముక్కామల్ల యాదయ్య, లారీలు మరియు ట్రాక్టర్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా తన భూమి గుండా దారి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రహదారి విస్తరణలో అడ్డుగా ఉన్న తాటి చెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు.ఈ పనులను చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్ మరియు రైతు యాదయ్య స్వయంగా పర్యవేక్షించి పూర్తి చేయించారు. రహదారి సమస్య పరిష్కారంతో ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకపోకలు సులభతరమయ్యాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నకాపర్తి రైతులకు ఊరట.

Article Image

.ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రహదారి సమస్యకు పరిష్కారం.

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద నెలకొన్న రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారం అందించగా, స్థానిక సర్పంచ్ మరియు రైతుల చొరవ కీలకంగా మారింది.

కొనుగోలు కేంద్రం సమీపంలో భూమి కలిగిన రైతు ముక్కామల్ల యాదయ్య, లారీలు మరియు ట్రాక్టర్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా తన భూమి గుండా దారి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రహదారి విస్తరణలో అడ్డుగా ఉన్న తాటి చెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు.ఈ పనులను చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్ మరియు రైతు యాదయ్య స్వయంగా పర్యవేక్షించి పూర్తి చేయించారు. రహదారి సమస్య పరిష్కారంతో ధాన్యం కొనుగోలు కేంద్రానికి రాకపోకలు సులభతరమయ్యాయి.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News