చెర్వుగట్టులో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహోత్సవాలకు ఘన ఏర్పాట్లు
చెర్వుగట్టులో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహోత్సవాలకు ఘన ఏర్పాట్లు
Editor Desk
నల్గొండ జిల్లా, స్థానికం ప్రధాన ప్రతినిధి
నార్కెట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలు జనవరి 23 నుంచి 30 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డైయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి భక్తిశ్రద్ధలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్తో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే వేముల వీరేశం జిల్లా అధికారులతో కలిసి బ్రహోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
బ్రహోత్సవాల అభివృద్ధి కోసం రూ.100 కోట్ల అంచనాలతో మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే, వచ్చే నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి