చెరువుగట్టు బ్రహ్మోత్సవాలలో మహాగణపతి పూజకు హాజరైన ఎమ్మెల్యే వేముల వీరేశం
చెరువుగట్టు బ్రహ్మోత్సవాలలో మహాగణపతి పూజకు హాజరైన ఎమ్మెల్యే వేముల వీరేశం
Komidala Mahender reddy
స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
నల్లగొండ జిల్లా, నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో మహా గణపతి పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ..
ప్రాచీన శైవ క్షేత్రమైన చెరువుగట్టు ఆలయానికి రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివస్తున్నారని, ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు. బ్రహ్మోత్సవాలు భక్తులందరికీ శాంతి, సుఖసంతోషాలు అందించాలని స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, దేవాలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి