చెర్వుగట్టు బ్రహోత్సవాలకు శ్రీకారం.వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
చెర్వుగట్టు బ్రహోత్సవాలకు శ్రీకారం.వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే వేముల వీరేశం
Editor Desk
నకిరేకల్ నియోజకవర్గం:
నార్కెట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలో ఈ నెల 23 నుంచి జరగనున్న శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి బ్రహోత్సవాలకు సంబంధించి వాల్ పోస్టర్ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం అవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెర్వుగట్టు బ్రహోత్సవాలకు ఏటా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, రహదారులు, పారిశుధ్యం, భద్రత వంటి ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహోత్సవాలు ప్రాంత ప్రజల ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని, ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి