చేనేత మరియు పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ సబ్సిడీ (200/500 యూనిట్లు) కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా చేనేత అధికారి బి. రామకృష్ణ తెలిపారు. అర్హులైన కార్మికులు తమ అప్లికేషన్లు స్థానిక గ్రామ/వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా చేనేత శాఖ అధికారులకు సమర్పించాలని సూచించారు.
చివరి తేదీ దగ్గరపడింది
ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 15, 2026 చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. గడువు ముగియకముందే అర్హులైనవారు దరఖాస్తులు సమర్పించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కార్మికులకు సూచనలు
అవసరమైన పత్రాలతో అప్లికేషన్ సమర్పించాలి
చివరి తేదీ తర్వాత వచ్చే దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవు
చేనేత, పవర్లూమ్ కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి