Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

ఛలో సూర్యాపేట: జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పోస్టర్ల ఆవిష్కరణ

ఛలో సూర్యాపేట: జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పోస్టర్ల ఆవిష్కరణ

ఛలో సూర్యాపేట: జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పోస్టర్ల ఆవిష్కరణ
February 22, 2026 02:59 PM 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


అర్వపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో జైభారత్ ఆధ్వర్యంలో ఈనెల 24న సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న “జైభారత్ సామాజిక విప్లవ రణభేరి సభ”కు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రికలను ఆదివారం ఆవిష్కరించారు.

ఈ సభ 24-02-2026న సూర్యాపేటలోని శ్రీలక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్ (సద్దలచెరువు హైటెక్ బస్టాండ్ సమీపంలో) నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా రణభేరి రాష్ట్ర కన్వీనర్ డా. ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ, “గాంధీ–అంబేద్కర్ల ఆశయాలు సాధిద్దాం… మనువాదాన్ని, మతోన్మాదాన్ని అంతం చేద్దాం” అనే నినాదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రణభేరి సభను విజయవంతం చేయడానికి పోరాట సంస్థల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.

కార్యక్రమంలో జైభారత్ జాతీయ ఉపాధ్యక్షులు గుండు వెంకన్న, జైభారత్ ఎస్సీ పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ గల్లా, జైభారత్ బీసీ పోరాట వేదిక సూర్యాపేట జిల్లా కార్యదర్శి దడిపల్లి వెంకట్, జైభారత్ రాష్ట్ర కార్యదర్శి ఖదిజ్ఞాసి రాజు, సామాజిక ఉద్యమకారులు నవిల ఉపేందర్, గుండగాని రేణుక, పల్లేటి రమేష్, జి. కోటయ్య తదితరులు పాల్గొన్నారు.రణభేరి సభ ద్వారా సామాజిక న్యాయం, సమానత్వ సాధనపై విస్తృత చర్చ జరగనుందని నాయకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News