Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధి సాధ్యం – విప్ బీర్ల ఐలయ్య సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:49 PM

ఛలో సూర్యాపేట: జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పోస్టర్ల ఆవిష్కరణ

ఛలో సూర్యాపేట: జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పోస్టర్ల ఆవిష్కరణ

ఛలో సూర్యాపేట: జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పోస్టర్ల ఆవిష్కరణ
February 22, 2026 02:59 PM 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


అర్వపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో జైభారత్ ఆధ్వర్యంలో ఈనెల 24న సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న “జైభారత్ సామాజిక విప్లవ రణభేరి సభ”కు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రికలను ఆదివారం ఆవిష్కరించారు.

ఈ సభ 24-02-2026న సూర్యాపేటలోని శ్రీలక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్ (సద్దలచెరువు హైటెక్ బస్టాండ్ సమీపంలో) నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా రణభేరి రాష్ట్ర కన్వీనర్ డా. ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ, “గాంధీ–అంబేద్కర్ల ఆశయాలు సాధిద్దాం… మనువాదాన్ని, మతోన్మాదాన్ని అంతం చేద్దాం” అనే నినాదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రణభేరి సభను విజయవంతం చేయడానికి పోరాట సంస్థల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.

కార్యక్రమంలో జైభారత్ జాతీయ ఉపాధ్యక్షులు గుండు వెంకన్న, జైభారత్ ఎస్సీ పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ గల్లా, జైభారత్ బీసీ పోరాట వేదిక సూర్యాపేట జిల్లా కార్యదర్శి దడిపల్లి వెంకట్, జైభారత్ రాష్ట్ర కార్యదర్శి ఖదిజ్ఞాసి రాజు, సామాజిక ఉద్యమకారులు నవిల ఉపేందర్, గుండగాని రేణుక, పల్లేటి రమేష్, జి. కోటయ్య తదితరులు పాల్గొన్నారు.రణభేరి సభ ద్వారా సామాజిక న్యాయం, సమానత్వ సాధనపై విస్తృత చర్చ జరగనుందని నాయకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News