ఛలో సూర్యాపేట: జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పోస్టర్ల ఆవిష్కరణ
ఛలో సూర్యాపేట: జైభారత్ సామాజిక విప్లవ రణభేరి పోస్టర్ల ఆవిష్కరణ
Biksham Goud
అర్వపల్లి మండల కేంద్రంలోని చౌరస్తాలో జైభారత్ ఆధ్వర్యంలో ఈనెల 24న సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న “జైభారత్ సామాజిక విప్లవ రణభేరి సభ”కు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రికలను ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సభ 24-02-2026న సూర్యాపేటలోని శ్రీలక్ష్మి గార్డెన్ ఫంక్షన్ హాల్ (సద్దలచెరువు హైటెక్ బస్టాండ్ సమీపంలో) నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా రణభేరి రాష్ట్ర కన్వీనర్ డా. ముప్పారం ప్రకాశం మాట్లాడుతూ, “గాంధీ–అంబేద్కర్ల ఆశయాలు సాధిద్దాం… మనువాదాన్ని, మతోన్మాదాన్ని అంతం చేద్దాం” అనే నినాదంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఐక్యతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రణభేరి సభను విజయవంతం చేయడానికి పోరాట సంస్థల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరుకావాలని కోరారు.
కార్యక్రమంలో జైభారత్ జాతీయ ఉపాధ్యక్షులు గుండు వెంకన్న, జైభారత్ ఎస్సీ పోరాట వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేష్ గల్లా, జైభారత్ బీసీ పోరాట వేదిక సూర్యాపేట జిల్లా కార్యదర్శి దడిపల్లి వెంకట్, జైభారత్ రాష్ట్ర కార్యదర్శి ఖదిజ్ఞాసి రాజు, సామాజిక ఉద్యమకారులు నవిల ఉపేందర్, గుండగాని రేణుక, పల్లేటి రమేష్, జి. కోటయ్య తదితరులు పాల్గొన్నారు.రణభేరి సభ ద్వారా సామాజిక న్యాయం, సమానత్వ సాధనపై విస్తృత చర్చ జరగనుందని నాయకులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి