Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:42 PM

చైతన్యపురిలో సంక్రాంతి సంబరాలు

చైతన్యపురిలో సంక్రాంతి సంబరాలు

చైతన్యపురిలో సంక్రాంతి సంబరాలు
January 11, 2026 02:12 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ముగ్గుల పోటీలు.. గొబ్బెమ్మల ముచ్చట.. పతంగుల సందడి

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి డివిజన్ పరిధిలోని విద్యుత్‌నగర్ కాలనీలో శుక్రవారం ఉత్సాహభరితమైన సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. చైతన్యపురి డివిజన్ యువ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

ఈ వేడుకలకు జయ చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్‌పర్సన్ దేవిరెడ్డి కమల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీలోని ప్రతి ఇంటి ముందూ రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మల అలంకరణలు సంక్రాంతి వాతావరణాన్ని ఆవిష్కరించాయి. చిన్నారులు పతంగులు ఎగురవేస్తూ పండుగ సంబరాల్లో మునిగిపోయారు.

ఈ సందర్భంగా కమల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ… రైతులు కష్టపడి పండించిన పంట ఇళ్లకు చేరే శుభసమయం సంక్రాంతి అని తెలిపారు. ధాన్యలక్ష్మికి స్వాగతం పలికేలా ఇంటి ముందు వేసే ముగ్గులు, గొబ్బెమ్మలు తెలుగు సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకూ అందరూ కలిసి పూలతో గొబ్బెమ్మలను అలంకరించి పాటలు పాడటం సంక్రాంతి ప్రత్యేకతగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ గౌడ్, శోభారాణి, ప్రసాద్, రంగేశ్వరి, నాగలక్ష్మి, జయశ్రీతో పాటు కాలనీ మహిళా నాయకులు అర్చన, కవిత, స్వాతి, అనురాధ, సయిదా, సనుత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News