PRINT TIME: April 10, 2026 12:08 PM
చైతన్యపురి కాలనీ సమస్యలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్రజలు
చైతన్యపురి కాలనీ సమస్యలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన ప్రజలు
January 18, 2026 11:34 AM
18 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి కాలనీకి సంబంధించిన సమస్యలను కాలనీ సభ్యులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న మౌలిక సదుపాయాల కొరత, అభివృద్ధి అవసరాలపై ఎమ్మెల్యేకు వివరించారు.
సమస్యలను శ్రద్ధగా విన్న సుధీర్ రెడ్డి మాట్లాడుతూ చైతన్యపురి కాలనీ అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాలనీ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం, సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ శరత్ కుమార్, జనరల్ సెక్రటరీ రామారావు పాల్గొన్నారు. అలాగే కాలనీ సభ్యులు పద్మనాభ శాస్త్రి, కృష్ణయ్య, పవన్ కుమార్, అజయ్ పాల్, వెంకట రమణ, చంద్రకుమార్, పార్థసారథి తదితరులు హాజరయ్యారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి