Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:11 AM

చిన్నకాపర్తి ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తాం.

చిన్నకాపర్తి ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తాం.

చిన్నకాపర్తి ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తాం.
January 02, 2026 05:16 AM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికo ప్రతినిధి కొమిడాలమహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ తాము చదువుకున్న పాఠశాలను మండల విద్యాధికారి సైదా నాయక్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని, పాఠశాల అభివృద్ధిలో తమ వంతు సహకరిస్తామని తెలియజేశారు. గ్రామంలోని ఉన్న పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎంపికైందని, వాటి ద్వారా వచ్చే నిధులతో విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యాన్ని కల్పించి విద్యార్థులకు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా త్వరలో చర్యలు చేపడతామని అన్నారు. విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలకు సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందుబాటులోకి తెస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న భవనం సీలింగ్ తొందరలోనే రిపేర్లు చేయించి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొని సర్పంచ్ గా అదే పాఠశాలకు వచ్చిన ఆవుల సుందర్ ను, ఉప సర్పంచ్ , బెల్లంకొండ లావణ్య రఘు ను ఎంఈఓ సైదా నాయక్ తో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సైదా నాయక్ విద్యా కమిటీ చైర్మన్ ఆవుల మాధవి, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News