Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:20 AM

చిన్నకాపర్తి ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తాం.

చిన్నకాపర్తి ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తాం.

చిన్నకాపర్తి ఉన్నత పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తాం.
January 02, 2026 05:16 AM 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికo ప్రతినిధి కొమిడాలమహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ తాము చదువుకున్న పాఠశాలను మండల విద్యాధికారి సైదా నాయక్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని, పాఠశాల అభివృద్ధిలో తమ వంతు సహకరిస్తామని తెలియజేశారు. గ్రామంలోని ఉన్న పాఠశాల అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఎంపికైందని, వాటి ద్వారా వచ్చే నిధులతో విద్యార్థులకు లైబ్రరీ సౌకర్యాన్ని కల్పించి విద్యార్థులకు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచే విధంగా త్వరలో చర్యలు చేపడతామని అన్నారు. విద్యార్థులకు సైన్స్ ప్రయోగాలకు సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందుబాటులోకి తెస్తామని అన్నారు. ప్రస్తుతం ఉన్న భవనం సీలింగ్ తొందరలోనే రిపేర్లు చేయించి పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలలో చదువుకొని సర్పంచ్ గా అదే పాఠశాలకు వచ్చిన ఆవుల సుందర్ ను, ఉప సర్పంచ్ , బెల్లంకొండ లావణ్య రఘు ను ఎంఈఓ సైదా నాయక్ తో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సైదా నాయక్ విద్యా కమిటీ చైర్మన్ ఆవుల మాధవి, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News