Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:59 AM

చదువు అన్నీ నేర్పించదు

చదువు అన్నీ నేర్పించదు

చదువు అన్నీ నేర్పించదు
17-01-2026 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టీఎన్ శేషన్ చెప్పిన అనుభవం… ఉన్నత పదవులకూ మించిన మనుష్యత పాఠం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఒక సందర్భంలో దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన టీఎన్ శేషన్, భార్యతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రాంతానికి పిక్నిక్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో పిచ్చుక గూళ్లతో నిండిన పెద్ద మామిడి తోటను చూశారు. ఆ గూళ్లను చూసి ముచ్చటపడిన శేషన్ భార్య, రెండు గూళ్లను ఇంటికి తీసుకెళ్లాలనే ఆలోచన వ్యక్తం చేశారు.దగ్గర్లో ఆవులను మేపుతున్న ఓ యువకుడిని పిలిపించి, పిచ్చుక గూళ్లను తీసిస్తే డబ్బు ఇస్తామని పోలీసు ఎస్కార్ట్ ఆశ చూపింది. తొలుత 10 రూపాయలు, ఆ తర్వాత 50 రూపాయల వరకు ఆఫర్ పెరిగింది. పోలీసుల ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ యువకుడు మాత్రం గూళ్లను తీయడానికి నిరాకరించాడు.

“మీరు ఎంత డబ్బు ఇచ్చినా గూళ్లను తీసి ఇవ్వలేను. ఆ గూళ్లలో ఉన్న పిల్ల పిచ్చుకల పరిస్థితి ఏమవుతుంది? సాయంత్రం తల్లి పిచ్చుక ఆహారం తెచ్చుకుని వచ్చి పిల్లలు కనిపించకపోతే ఆమె పడే బాధ ఎవరు భరిస్తారు?” అని ఆ యువకుడు ప్రశ్నించాడు.

ఈ మాటలు విన్న శేషన్ దంపతులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అనంతరం ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ టీఎన్ శేషన్ మాట్లాడుతూ,

“నా పదవి, నా హోదా, నా చదువు, నా ఐఏఎస్ అన్నీ కూడా ఆ ఆవులను కాసే యువకుడి విజ్ఞత ముందు చిన్నబోయాయి. విద్య, స్థానం, సామాజిక హోదా అన్నవి మానవత్వం ముందు నిలబడలేవు. ఈ సంఘటన మమ్మల్ని రోజులు తరబడి అపరాధభావంతో వెంటాడింది” అని పేర్కొన్నారు.పదవులు, కుర్చీలు మనిషికి గౌరవం తీసుకురావు… మనిషి వ్యక్తిత్వం, విజ్ఞత వల్లే ఆ పదవికే గౌరవం వస్తుందన్న సత్యాన్ని ఈ సంఘటన స్పష్టం చేస్తుందని శేషన్ వ్యాఖ్యానించారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు సమాజానికి ఉపయోగపడేలా ఆలోచించాలి, మానవత్వంతో నిర్ణయాలు తీసుకోవాలే గానీ, అహంకారంతో ప్రవర్తించడం మూర్ఖత్వమేనని స్పష్టం చేశారు.మేనేజ్‌మెంట్ సెమినార్‌లో విద్యార్థులతో పంచుకున్న ఈ అనుభవం, చదువుకంటే మించిన విలువలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేసే గొప్ప జీవిత పాఠంగా నిలిచింది.

Sthanikam

చదువు అన్నీ నేర్పించదు

Article Image

టీఎన్ శేషన్ చెప్పిన అనుభవం… ఉన్నత పదవులకూ మించిన మనుష్యత పాఠం

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఒక సందర్భంలో దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన టీఎన్ శేషన్, భార్యతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ఓ ప్రాంతానికి పిక్నిక్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో పిచ్చుక గూళ్లతో నిండిన పెద్ద మామిడి తోటను చూశారు. ఆ గూళ్లను చూసి ముచ్చటపడిన శేషన్ భార్య, రెండు గూళ్లను ఇంటికి తీసుకెళ్లాలనే ఆలోచన వ్యక్తం చేశారు.దగ్గర్లో ఆవులను మేపుతున్న ఓ యువకుడిని పిలిపించి, పిచ్చుక గూళ్లను తీసిస్తే డబ్బు ఇస్తామని పోలీసు ఎస్కార్ట్ ఆశ చూపింది. తొలుత 10 రూపాయలు, ఆ తర్వాత 50 రూపాయల వరకు ఆఫర్ పెరిగింది. పోలీసుల ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ యువకుడు మాత్రం గూళ్లను తీయడానికి నిరాకరించాడు.

“మీరు ఎంత డబ్బు ఇచ్చినా గూళ్లను తీసి ఇవ్వలేను. ఆ గూళ్లలో ఉన్న పిల్ల పిచ్చుకల పరిస్థితి ఏమవుతుంది? సాయంత్రం తల్లి పిచ్చుక ఆహారం తెచ్చుకుని వచ్చి పిల్లలు కనిపించకపోతే ఆమె పడే బాధ ఎవరు భరిస్తారు?” అని ఆ యువకుడు ప్రశ్నించాడు.

ఈ మాటలు విన్న శేషన్ దంపతులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అనంతరం ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ టీఎన్ శేషన్ మాట్లాడుతూ,

“నా పదవి, నా హోదా, నా చదువు, నా ఐఏఎస్ అన్నీ కూడా ఆ ఆవులను కాసే యువకుడి విజ్ఞత ముందు చిన్నబోయాయి. విద్య, స్థానం, సామాజిక హోదా అన్నవి మానవత్వం ముందు నిలబడలేవు. ఈ సంఘటన మమ్మల్ని రోజులు తరబడి అపరాధభావంతో వెంటాడింది” అని పేర్కొన్నారు.పదవులు, కుర్చీలు మనిషికి గౌరవం తీసుకురావు… మనిషి వ్యక్తిత్వం, విజ్ఞత వల్లే ఆ పదవికే గౌరవం వస్తుందన్న సత్యాన్ని ఈ సంఘటన స్పష్టం చేస్తుందని శేషన్ వ్యాఖ్యానించారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు సమాజానికి ఉపయోగపడేలా ఆలోచించాలి, మానవత్వంతో నిర్ణయాలు తీసుకోవాలే గానీ, అహంకారంతో ప్రవర్తించడం మూర్ఖత్వమేనని స్పష్టం చేశారు.మేనేజ్‌మెంట్ సెమినార్‌లో విద్యార్థులతో పంచుకున్న ఈ అనుభవం, చదువుకంటే మించిన విలువలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుచేసే గొప్ప జీవిత పాఠంగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News