Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:42 AM

బోటిమీది గూడెం అభివృద్ధికి యువత ముందడుగు

బోటిమీది గూడెం అభివృద్ధికి యువత ముందడుగు

బోటిమీది గూడెం అభివృద్ధికి యువత ముందడుగు
January 22, 2026 02:24 PM 256 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోటిమీది గూడెం అభివృద్ధికి యువత ఐక్యత

పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు

స్థానికం ప్రధాన ప్రతినిధి

మునిపంపుల గ్రామం 9వ వార్డుకు చెందిన బోటిమీది గూడెం అభివృద్ధి బాధ్యతను స్థానిక యువత స్వయంగా భుజాన వేసుకుంది. ఏండ్ల తరబడి మౌలిక వసతులు లేకుండా నిర్లక్ష్యానికి గురైన గూడెం పరిస్థితిని గమనించిన యువకులు పార్టీలకు అతీతంగా ఐక్యమై అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు.

డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితుల్లో గూడెం ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించాలనే లక్ష్యంతో డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం.కమిటీ అధ్యక్షుడిగా ఏడవెల్లి నరేష్, ఉపాధ్యక్షుడిగా కోమిరే ప్రశాంత్, కార్యదర్శిగా తెల్కలపల్లి గిరి, సహాయ కార్యదర్శిగా అదొండ హరినాథ్ బాధ్యతలు స్వీకరించారు. గూడెం అభివృద్ధి కోసం తమ శక్తి సామర్థ్యాలకు మించి పనిచేస్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.

నందనంగా, సుందరంగా బోటిమీది గూడెాన్ని తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని తెలిపారు.

ఈ సమావేశంలో 9వ వార్డు సభ్యులు మేకల జలేందర్, అదొండా రాజు, మామిండ్ల శివ, అదొండా బాలరాజు, కుకూట్ల మత్స్యగిరి, పీట్ల రమేష్, శిరీషలా శివప్రసాద్, తెల్కపల్లి గిరి, కళ్లెం రమేష్, ఏడవెల్లి నర్సింహా, మేకల నరేష్, శిరీషలా గణేష్, శిరీషలా మనియర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News