బోటిమీది గూడెం అభివృద్ధికి యువత ముందడుగు
బోటిమీది గూడెం అభివృద్ధికి యువత ముందడుగు
స్థానికం బృందం
బోటిమీది గూడెం అభివృద్ధికి యువత ఐక్యత
పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు
స్థానికం ప్రధాన ప్రతినిధి
మునిపంపుల గ్రామం 9వ వార్డుకు చెందిన బోటిమీది గూడెం అభివృద్ధి బాధ్యతను స్థానిక యువత స్వయంగా భుజాన వేసుకుంది. ఏండ్ల తరబడి మౌలిక వసతులు లేకుండా నిర్లక్ష్యానికి గురైన గూడెం పరిస్థితిని గమనించిన యువకులు పార్టీలకు అతీతంగా ఐక్యమై అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు.
డ్రైనేజీ వంటి కనీస సౌకర్యాలు కూడా లేని పరిస్థితుల్లో గూడెం ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించాలనే లక్ష్యంతో డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం విశేషం.కమిటీ అధ్యక్షుడిగా ఏడవెల్లి నరేష్, ఉపాధ్యక్షుడిగా కోమిరే ప్రశాంత్, కార్యదర్శిగా తెల్కలపల్లి గిరి, సహాయ కార్యదర్శిగా అదొండ హరినాథ్ బాధ్యతలు స్వీకరించారు. గూడెం అభివృద్ధి కోసం తమ శక్తి సామర్థ్యాలకు మించి పనిచేస్తామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.
నందనంగా, సుందరంగా బోటిమీది గూడెాన్ని తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని తెలిపారు.
ఈ సమావేశంలో 9వ వార్డు సభ్యులు మేకల జలేందర్, అదొండా రాజు, మామిండ్ల శివ, అదొండా బాలరాజు, కుకూట్ల మత్స్యగిరి, పీట్ల రమేష్, శిరీషలా శివప్రసాద్, తెల్కపల్లి గిరి, కళ్లెం రమేష్, ఏడవెల్లి నర్సింహా, మేకల నరేష్, శిరీషలా గణేష్, శిరీషలా మనియర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి