బోరంచ గ్రామంలో పాపమ్మ గడ్డ కాలనీలో విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం
బోరంచ గ్రామంలో పాపమ్మ గడ్డ కాలనీలో విద్యుత్ సమస్యకు తక్షణ పరిష్కారం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో ఇటీవల నెలలుగా “పాపమ్మ గడ్డ” పేరుతో ఏర్పడిన కొత్త కాలనీలో నివసిస్తున్న ప్రజలు, తమ ఇళ్ల మధ్యగా వెళ్తున్న 33 కేవీ విద్యుత్ లైన్ వైర్లు తక్కువ ఎత్తులో ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రమాద భయంతో జీవిస్తున్నారు. ఈ సమస్యను గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, కాలనీవాసులు కలిసి నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి. సంజీవరెడ్డి మరియు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్ దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేలా సూచించారు. దీనితో ఈ రోజు గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప స్వయంగా పర్యవేక్షణలో 33 కేవీ విద్యుత్ లైన్ స్తంభాలను ఎత్తుగా ఏర్పాటు చేసి వైర్లను సురక్షిత స్థాయికి పైకి ఎత్తే పనులు పూర్తి చేశారు. దీంతో కాలనీవాసులకు సమస్య నుండి ఉపశమనం లభించగా, ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, కాలనీవాసులు ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి