బోరంచ గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య హనుమాన్ చాలీసా కార్యక్రమం
బోరంచ గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య హనుమాన్ చాలీసా కార్యక్రమం
Krishna
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో శనివారం హనుమాన్ ఆలయంలో విశ్వ హిందు పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగింది. రెండో వారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ యువత, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి భావంతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ ప్రాంగణం మొత్తం “జై శ్రీరామ్”, “జై శ్రీరామ్” నినాదాలతో మారుమోగిపోయింది. యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హనుమంతుడి ఆశీస్సులతో గ్రామంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం నెలకొనాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, విశ్వ హిందు పరిషత్, బజరంగదళ్ కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి