Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:44 AM

బోరంచ గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య హనుమాన్ చాలీసా కార్యక్రమం

బోరంచ గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య హనుమాన్ చాలీసా కార్యక్రమం

బోరంచ గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య హనుమాన్ చాలీసా కార్యక్రమం
23-05-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో శనివారం హనుమాన్ ఆలయంలో విశ్వ హిందు పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగింది. రెండో వారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ యువత, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి భావంతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ ప్రాంగణం మొత్తం “జై శ్రీరామ్”, “జై శ్రీరామ్” నినాదాలతో మారుమోగిపోయింది. యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హనుమంతుడి ఆశీస్సులతో గ్రామంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం నెలకొనాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, విశ్వ హిందు పరిషత్, బజరంగదళ్ కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచ గ్రామంలో భక్తి శ్రద్ధల మధ్య హనుమాన్ చాలీసా కార్యక్రమం

Article Image

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో శనివారం హనుమాన్ ఆలయంలో విశ్వ హిందు పరిషత్, బజరంగదళ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా కార్యక్రమం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగింది. రెండో వారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ యువత, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి భావంతో హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ ప్రాంగణం మొత్తం “జై శ్రీరామ్”, “జై శ్రీరామ్” నినాదాలతో మారుమోగిపోయింది. యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హనుమంతుడి ఆశీస్సులతో గ్రామంలో శాంతి, ఐక్యత, సౌభ్రాతృత్వం నెలకొనాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, విశ్వ హిందు పరిషత్, బజరంగదళ్ కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News