Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:25 PM

బోగారంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన యువ సర్పంచ్

బోగారంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన యువ సర్పంచ్

బోగారంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన యువ సర్పంచ్
January 26, 2026 06:19 PM 265 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం బోగారం గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువ సర్పంచ్ కునూరు సాయికుమార్ గౌడ్ జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎందరో అమరవీరుల త్యాగ ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ, స్వతంత్రాన్ని అనుభవిస్తున్నామని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతిని ధ్యేయంగా పెట్టుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి పౌరులకు హక్కులు కల్పించారని గుర్తుచేశారు. భారతదేశ సార్వభౌమత్వం, స్వేచ్ఛను గౌరవిస్తూ నేటి బాలలను రేపటి బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు సూచించారు.గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సర్పంచ్ బహుమతులు అందజేసి ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలప్రధానోపాధ్యాయుడు ముసుకు వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ ఉమా మహేష్ యాదవ్, వార్డు సభ్యులు గోగు ప్రమీల రమేష్, కనుకు మల్లేశం, మేడి ఆంజనేయులు దేవి, నేరటిమాన సురేష్ యాదవ్, కడారి పావని పాపయ్య, గోగు సురేష్ యాదవ్, చిరగోనో శిల్పా నవీన్ యాదవ్, వనం అండాలు యాదగిరి, పంచాయతీ కార్యదర్శి అయ్యప్ప రెడ్డి, మహిళా సంఘం అధ్యక్షురాలు పబ్బు జ్యోతి, దనమ్మ, భోగ సంధ్య, అంగన్వాడీ కార్యకర్త బత్తుల వసంత, ఆశా కార్యకర్త జెల్లా పారిజాత, ఉపాధ్యాయులు, గ్రామ యువత, గ్రామ పెద్దలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News