బోగారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ క్రీడా సందడి – విజేతలకు గోగు హరిప్రసాద్ భారీ బహుమతులు
బోగారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ క్రీడా సందడి – విజేతలకు గోగు హరిప్రసాద్ భారీ బహుమతులు
Editor Desk
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు –
విజేతలకు గోగు హరిప్రసాద్ బహుమతులు
రామన్న పేట స్థానికం ప్రధాన ప్రతినిధి
మకర సంక్రాంతి పండుగ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో విజయం సాధించిన జట్లకు యూత్ కాంగ్రెస్ నాయకులు గోగు హరిప్రసాద్ తన సొంత నిధులతో బహుమతులు అందజేశారు.
పోటీల్లో మొదటి బహుమతిని మేడి అభిరామ్ టీం సభ్యులు, రెండవ బహుమతిని కూనూరు వెంకటేష్ టీం సభ్యులు, మూడవ బహుమతిని గుంట కండ్ల శ్రీనివాస్ టీం సభ్యులు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా గోగు హరిప్రసాద్ మాట్లాడుతూ, యువత క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఐక్యత పెరుగుతుందని అన్నారు. గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ గంపల రామచంద్రారెడ్డి, గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మధ్యపురి ఐలయ్య, ఇమామ్, గంపల జీవన్ రెడ్డి, వనం కిష్టయ్య, సురేష్, కందగట్ల రాములు, గోగు సురేష్, గుంతకండ్ల గోవర్ధన్ రెడ్డి,మెట్టు శ్రవణ్, నేరటి మని కనుకు రాము, సిరబోయిన సాయి, కడారి సాయి ఏర్పుల ప్రవీణ్, బోగ అనిల్,బొడ్డుపల్లి చాణిక్య,గుంజే భరత్, మేడిరాజు,మేడి మచ్చి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి