బొడ్రాయి తో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్
బొడ్రాయి తో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్
Editor Desk
నల్లగొండ:
గ్రామ దేవతలను ఆరాధించినప్పుడే ఆయా ప్రాంతాలు సుభిక్షంగా అభివృద్ధి చెందుతాయని 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని అవుట్డోర్ స్టేడియం వద్ద బొడ్రాయి పండుగపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందేళ్ల క్రితం గొల్లగూడ ప్రాంతంలో బొడ్రాయి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించి, బొడ్రాయిని పునఃప్రతిష్ట చేయాల్సిన అవసరం ఉందన్నారు. గొల్లగూడ పెద్దబండ ప్రాంతంలో తరచుగా యువకులు అకాల మరణాలకు గురవుతున్నారని, బొడ్రాయి లేకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
ప్రజలందరూ ఏకమై బొడ్రాయి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా 42వ డివిజన్ కార్పొరేటర్ అల్లి మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ, మన పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను తప్పనిసరిగా కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కత్తుల తులసీదాస్, చింతల సత్యం, సముద్రాల మల్లికార్జున్ గౌడ్, నల్ల నరసింహ, గోగుల మల్లయ్య, కుంచెం ఎల్లయ్య, బత్తుల నరసింహ యాదవ్, నాంపల్లి గోపి, ఆమంచి వెంకటేశ్వర్లు, బోళ్ల వెంకట్ ముదిరాజ్, కత్తుల సైదులు, చింతల పెద్దులు, చిన్న సైదులు, రాఘవ, చిట్టీమల్ల శంకర్, అల్లి సైదులు, మొగుళ్ల సైదులు, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి