Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక అక్రమ మైనింగ్ ఆరోపణలపై అధికారుల మౌనం ఎందుకు?... హైకోర్టును ఆశ్రయించిన ఆర్టీఐ కార్యకర్త ఉబ్బని రాజు ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 07:58 AM

బొడ్రాయి తో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్

బొడ్రాయి తో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్

బొడ్రాయి తో గ్రామాలు సుభిక్షంగా ఉంటాయి. 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్
April 13, 2026 03:22 AM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ:

గ్రామ దేవతలను ఆరాధించినప్పుడే ఆయా ప్రాంతాలు సుభిక్షంగా అభివృద్ధి చెందుతాయని 20వ డివిజన్ కార్పొరేటర్ అల్లి సుభాష్ యాదవ్ అన్నారు. ఆదివారం నల్లగొండ పట్టణంలోని అవుట్‌డోర్ స్టేడియం వద్ద బొడ్రాయి పండుగపై చర్చా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందేళ్ల క్రితం గొల్లగూడ ప్రాంతంలో బొడ్రాయి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించి, బొడ్రాయిని పునఃప్రతిష్ట చేయాల్సిన అవసరం ఉందన్నారు. గొల్లగూడ పెద్దబండ ప్రాంతంలో తరచుగా యువకులు అకాల మరణాలకు గురవుతున్నారని, బొడ్రాయి లేకపోవడం కూడా ఒక కారణమై ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

ప్రజలందరూ ఏకమై బొడ్రాయి పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా 42వ డివిజన్ కార్పొరేటర్ అల్లి మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ, మన పూర్వీకులు పాటించిన సంప్రదాయాలను తప్పనిసరిగా కొనసాగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కత్తుల తులసీదాస్, చింతల సత్యం, సముద్రాల మల్లికార్జున్ గౌడ్, నల్ల నరసింహ, గోగుల మల్లయ్య, కుంచెం ఎల్లయ్య, బత్తుల నరసింహ యాదవ్, నాంపల్లి గోపి, ఆమంచి వెంకటేశ్వర్లు, బోళ్ల వెంకట్ ముదిరాజ్, కత్తుల సైదులు, చింతల పెద్దులు, చిన్న సైదులు, రాఘవ, చిట్టీమల్ల శంకర్, అల్లి సైదులు, మొగుళ్ల సైదులు, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News