PRINT TIME: April 11, 2026 03:21 PM
బోడ రాములమ్మ మృతి కి సంతాపం తెలిపిన కాంగ్రెస్ నాయకులు
బోడ రాములమ్మ మృతి కి సంతాపం తెలిపిన కాంగ్రెస్ నాయకులు
January 31, 2026 12:01 PM
77 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపాలిటీ ఏడో వార్డుకు చెందిన బోడ రాములమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ పాల్గొని, రాములమ్మ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబానికి పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో దేశపాక రాజేష్, బోడ స్వామి, గంగాపురం గణేష్, పాల శివ, బోడ శ్రీనివాస్, బొలుగురి లింగయ్య, పాల యాదయ్య, జీడిమెట్ల రాజు, కుక్కల కిట్టు తదితరులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి ఈ కష్ట సమయంలో ధైర్యం చెప్పి, వారి బాధను పంచుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి