బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్
Editor Desk
రామకృష్ణాపురం డివిజన్ (35)లో బిఆర్ఎస్ జెండా ఎగరవేయాలని కేటీఆర్ ఆకాంక్ష
హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ను శ్రీ రామకృష్ణాపురం డివిజన్ (35) బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వీరమళ్ల రామ్ నరసింహ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం ‘తెలంగాణ భవన్’లో ఈ భేటీ జరిగింది.ఈ సందర్భంగా డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ కేటీఆర్కు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్లో పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిస్థితులు, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో శ్రీ రామకృష్ణాపురం డివిజన్లో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసి కార్పొరేటర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పని చేస్తే విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి