Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:55 AM

భువనగిరిలో ‘పరీక్షా పే చర్చ 2026’ క్విజ్

భువనగిరిలో ‘పరీక్షా పే చర్చ 2026’ క్విజ్

భువనగిరిలో ‘పరీక్షా పే చర్చ 2026’ క్విజ్
23-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

భువనగిరి: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ (PPC)–2026’ కార్యక్రమంలో భాగంగా క్విజ్ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధానంగా పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.ముఖ్య అతిథిగా ప్రసిద్ధ విద్యావేత్త, ఐఏఎస్ ట్రైనర్ శ్రీ రవి కుమార్ ప్రజాపతి హాజరయ్యారు. చిన్న వయసులో ఐస్‌క్రీం విక్రేతగా జీవితం ప్రారంభించి, AP State Law CET–2003లో రెండో ర్యాంకు, నాలుగు సార్లు IAS ఇంటర్వ్యూలకు చేరిన ఆయన జీవన ప్రయాణం విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. ప్రస్తుతం శాంతా లక్ష్మి IAS అకాడమీ వ్యవస్థాపకుడు, PRISM360 NGO డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.

ఈ సందర్భంగా రవి కుమార్ ప్రజాపతి వ్యాఖ్యానిస్తూ, “పరీక్షలు జీవితాన్ని నిర్ణయించవు. క్రమశిక్షణ, నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసమే జీవన దిశను నిర్ధారిస్తుంది. భయాన్ని దూరం పెట్టి లక్ష్యంపై దృష్టి పెట్టాలి” అని సూచించారు.ఈ కార్యక్రమంలో సిబిసిఇ అఫిలియేటెడ్ పాఠశాలలు, పీఎం శ్రీ స్కూల్స్, కేజిబివి పాఠశాలలు, టిజిఎంస్ పాఠశాలల నుండి 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మధ్యస్థాయి మరియు సెకండరీ స్థాయిలకు అనుగుణంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు.

పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. చంద్ర మౌళి మాట్లాడుతూ, “పరీక్షా పే చర్చ కార్యక్రమం విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచి, పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది” అన్నారు.క్విజ్ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్కార్ట్ టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.మొత్తం‌గా ఈ PPC–2026 కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణ, పరీక్షల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంలో ఆదర్శవంతమైన కార్యక్రమంగా నిల

Sthanikam

భువనగిరిలో ‘పరీక్షా పే చర్చ 2026’ క్విజ్

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

భువనగిరి: పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ భువనగిరిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పరీక్షా పే చర్చ (PPC)–2026’ కార్యక్రమంలో భాగంగా క్విజ్ పోటీలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధానంగా పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.ముఖ్య అతిథిగా ప్రసిద్ధ విద్యావేత్త, ఐఏఎస్ ట్రైనర్ శ్రీ రవి కుమార్ ప్రజాపతి హాజరయ్యారు. చిన్న వయసులో ఐస్‌క్రీం విక్రేతగా జీవితం ప్రారంభించి, AP State Law CET–2003లో రెండో ర్యాంకు, నాలుగు సార్లు IAS ఇంటర్వ్యూలకు చేరిన ఆయన జీవన ప్రయాణం విద్యార్థులకు ప్రేరణగా నిలిచింది. ప్రస్తుతం శాంతా లక్ష్మి IAS అకాడమీ వ్యవస్థాపకుడు, PRISM360 NGO డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.

ఈ సందర్భంగా రవి కుమార్ ప్రజాపతి వ్యాఖ్యానిస్తూ, “పరీక్షలు జీవితాన్ని నిర్ణయించవు. క్రమశిక్షణ, నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసమే జీవన దిశను నిర్ధారిస్తుంది. భయాన్ని దూరం పెట్టి లక్ష్యంపై దృష్టి పెట్టాలి” అని సూచించారు.ఈ కార్యక్రమంలో సిబిసిఇ అఫిలియేటెడ్ పాఠశాలలు, పీఎం శ్రీ స్కూల్స్, కేజిబివి పాఠశాలలు, టిజిఎంస్ పాఠశాలల నుండి 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. మధ్యస్థాయి మరియు సెకండరీ స్థాయిలకు అనుగుణంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు.

పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. చంద్ర మౌళి మాట్లాడుతూ, “పరీక్షా పే చర్చ కార్యక్రమం విద్యార్థుల్లో మానసిక స్థైర్యాన్ని పెంచి, పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది” అన్నారు.క్విజ్ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్కార్ట్ టీచర్లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.మొత్తం‌గా ఈ PPC–2026 కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణ, పరీక్షల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించడంలో ఆదర్శవంతమైన కార్యక్రమంగా నిల

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News