భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి.వట్టె జానయ్య యాదవ్
భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి.వట్టె జానయ్య యాదవ్
Biksham
జిల్లా కలెక్టర్ను కలిసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో అనేక మంది ప్రజలు భూముల రికార్డుల లోపాలు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, సర్వే సమస్యలు, ఆక్రమణలు వంటి కారణాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాధారణ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను జిల్లా యంత్రాంగం అత్యంత ప్రాధాన్యంతో పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని కలెక్టర్ను కోరారు. అలాగే పట్టణంలోని ఇతర మౌలిక వసతుల సమస్యలపై కూడా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వారి పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు మండలం అధ్యక్షుడు బొల్లె సైదులు, మామిడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి